మానవ శరీరంలో వ్యాధికారక బ్యాక్టీరియాను గుర్తించి చంపేందుకు ఐఐటీ మద్రాస్ (ఐఐటీఎం) శాస్త్రవేత్తలు అధునాతన పాలిమర్ టెక్నాలజీని తీసుకొచ్చారు. యాంటీబయాటిక్స్, క్రిమిసంహారకాలు, రేడియేషన్ పద్ధతులు, ఇతర యాంటీ మైక్రోబయల్ రసాయనాలను వినియోగించకుండానే ఈ ఘనత సాధించడంతో పేటెంట్ దక్కిందని ఐఐటీఎం వర్గాలు తెలిపాయి.
శరీరంలో వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది. వీటిని ‘సూపర్ బగ్స్’గా పిలుస్తున్నారు.