భారత సైన్యానికి అవసరమయ్యే 30 వీటీవోఎల్, కమికాజీ డ్రోన్ యూనిట్లను సరఫరా చేసే కాంట్రాక్టు విశాఖపట్నానికి చెందిన నభాస్త్ర సంస్థకు దక్కింది. ప్రభుత్వ ఇ-మార్కెట్ పోర్టల్లో తామే తక్కువ మొత్తానికి కోట్ చేసి, ఎల్ 1 బిడ్డర్గా నిలిచినట్లు సంస్థ తెలిపింది. సైన్యం కోసం వీటీవోఎల్, అటానమస్ డైవ్ రికవరీ కమికాజీ డ్రోన్ వేరియంట్లను అభివృద్ధి చేస్తామని సంస్థ వివరించింది.