దేశంలోనే అతిపెద్ద సింగిల్ క్లస్టర్ కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక వసతుల ప్లాంటును ఎల్ అండ్ టీ నిర్మించనుంది. తన ఏఐ మౌలిక వసతుల విభాగం ఎల్టీఎన్ కంప్యూట్, ఏఐ డేటా సెంటర్ వ్యాపార విభాగం వ్యోమా.ఏఐ కలిసి చెన్నైలో ఎన్విడియా బీ300 ఆధారిత ఏఐ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. అమెరికాకు చెందిన టుగెదర్ ఏఐ అనే కంపెనీకి చెందిన ఏఐ నేటివ్ క్లౌడ్ ప్లాట్ఫాంకు ఈ ఫ్యాక్టరీ సేవలందిస్తుంది.