కొచ్చిన్ షిప్యార్డు లిమిటెడ్ సంస్థ భారత నౌకాదళం కోసం ‘మచిలీపట్నం’ అనే పేరుతో నిర్మించిన జలాంతర్గామి విధ్వంసక నౌకను 2026, జులై 29న లాంఛనంగా ప్రారంభించారు. భారత్ నిర్మిస్తున్న జలాంతర్గామి విధ్వంసక నౌకల పరంపరలో ఇది ఏడోది. ఈ సీరీస్లో మొత్తం ఎనిమిది నౌకలు నిర్మించాలన్నది లక్ష్యం. ఈ నౌక సముద్ర గర్భంలో నిఘా ఉంచేందుకు, జలాంతర్గాముల విధ్వంసానికి, తక్కువ శ్రేణి సముద్రయాన కార్యకలాపాలకు కావాల్సిన సామర్థ్యం కలిగి ఉంటుందని రక్షణ శాఖ ప్రకటించింది.