భారతదేశంలో 173 దేశాలకు చెందిన 58,134 మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో చేరారని 2023-24 సంవత్సరానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ఆలిండియా సర్వేలో వెల్లడైంది. నేపాల్ నుంచి అత్యధికంగా 24.1 శాతం మంది విద్యార్థులు వచ్చారు. యూఏఈ (7%), యూఎస్ (5.9%), బంగ్లాదేశ్ (5.9%), నైజీరియా (5.5%) జింబాబ్వే (4%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. లెబనాన్, బుర్కినాఫాసో, మంగోలియా, మెక్సికో, కజకస్థాన్, బెలారస్, చిలీ తదితర దేశాల నుంచీ విద్యార్థులు వస్తున్నారు.