భారతదేశంలో ప్రధాన వంతెనలు (పార్ట్‌-2)

భారతదేశంలో ప్రధాన వంతెనలు (పార్ట్‌-2)

వంతెనలనేవి జలాశయాలు, లోయలు లేదా రహదారులపై విస్తరించి సులభమైన ప్రయాణం, రవాణాకు వీలు కల్పించే కీలక నిర్మాణాలు. వీటిలో రహదారులు, రైలు - రోడ్డు వంతెనలు, ఇతర అద్భుత ఆవిష్కరణలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు మన దేశ ఇంజినీరింగ్‌ సామర్థ్యాలను ప్రతిబింబించడమే కాకుండా, కీలక ప్రదేశాలను కలుపుతూ ఆర్థిక వృద్ధిని ప్రేరేపించేలా ప్రాంతాల మధ్య ముఖ్య అనుసంధానాలుగా పనిచేస్తాయి. భారతదేశంలోని వంతెనలు దేశ మౌలిక సదుపాయాల్లో అంతర్భాగంగా ఉండి, అనుసంధానాన్ని మెరుగుపరుస్తూ, ఉత్పదకతను పెంచుతున్నాయి. ఈ పార్ట్‌-2లో దేశంలో ముఖ్య వంతెనల్లో మిగిలినవాటి గురించి తెలుసుకుందాం! (ఇది పేజీకి వద్దు. పోస్ట్స్‌కి మాత్రమే)

చినాబ్‌ వంతెన

జమ్మూ-కశ్మీర్‌లోని చినాబ్‌ నదిపై ఉపరితలానికి 359 మీటర్ల (1,178 అడుగుల) ఎత్తులో దీన్ని నిర్మించారు. 1.31 కి.మీ. మేర విస్తరించిన దీని నిర్మాణానికి కేంద్రం రూ.1,486 కోట్లు ఖర్చు చేసింది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఈ బ్రిడ్జి పారిస్‌ నగరంలోని ఈఫిల్‌ టవర్, న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉంది. వంతెన నిర్మాణంలో భాగంగా అతిపొడవైన ఉక్కు ఆర్చిని అంత ఎత్తులో జతచేయడం ఒక అద్భుతంగా పరిగణిస్తారు.

వెంబనాడ్‌ రైల్‌ బ్రిడ్జ్‌

కేరళలో ఉన్న ఈ రైల్‌ బ్రిడ్జ్‌ 4.62 కి.మీ. పొడవుతో భారతదేశంలోనే రెండో అత్యంత పొడవైన రైల్వే వంతెనగా నిలిచింది (అస్సాంలోని బోగిబీల్‌ వంతెన 4.94 కి.మీ. పొడవుతో ఉంది. అయితే అది రోడ్డు, రైలు వంతెన). ఇది కొచ్చిలోని ఎడపల్లి ప్రాంతాన్ని వల్లార్‌పాదమ్‌ ద్వీపంలోని ఇంటర్నేషనల్‌ కంటైనర్‌ ట్రాన్‌షిప్‌మెంట్‌ టెర్మినల్‌ (ఐసీటీటీ)తో కలుపుతుంది. ఇది దేశంలోనే అతిపెద్దదైన వెంబనాడ్‌ సరస్సు బ్యాక్‌ వాటర్స్‌పై నిర్మితమైంది.

దిఘా - సోన్‌పూర్‌ వంతెన

దీన్ని జేపీ సేతు (జయప్రకాశ్‌ నారాయణ్‌ పేరిట) అని కూడా అంటారు. బిహార్‌లోని గంగా నదిపై నిర్మించారు. పొడవు 4.55 కి.మీ. ఇది పట్నాలోని దీఘా ఘాట్‌ను సరన్‌ జిల్లా సోన్‌పూర్‌లో ఉన్న పహలేజా ఘాట్‌తో కలిపే కీలకమైన రైలు - రోడ్డు మార్గంగా పనిచేస్తుంది. ఇది ఉత్తర బిహార్‌ (సారన్‌/ తిర్హుత్‌ డివిజన్లు), దక్షిణ బిహార్‌ (పట్నా/ మగధ డివిజన్లు) మధ్య అంతరాన్ని పూరిస్తుంది. పట్నా, ఛప్రా లాంటి నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. 

అర్రా - ఛప్రా వంతెన

వీర్‌ కున్వర్‌ సింగ్‌ సేతు అని కూడా పిలుస్తారు. బిహార్‌లోని గంగా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జ్‌ భోజ్‌పూర్‌ జిల్లాలోని అర్రాను సరన్‌ జిల్లాలోని ఛప్రాతో కలుపుతుంది. ఇది ఈ రెండు పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు వాటి మధ్య ఆర్థిక, సంస్కృతిక సంబంధాలను పెంపొందించడంలో దోహదం చేసింది. దీని పొడవు 4.35 కి.మీ. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మల్టీ స్పాన్‌ ఎక్స్‌ట్రాడోస్ట్‌ వంతెనగా పేరొందింది. 

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ సెవ్రీ-నహవా శేవా అటల్‌ సేతు, అంజీ ఖాడ్‌ రైల్వే వంతెన, పాంబన్‌ వర్టికల్‌ రైల్వే వంతెన, కుమార్‌ భాస్కర్‌ వర్మ సేతు, సుదర్శన్‌ సేతు గురించిన సమాచారంతోపాటు గతంలో ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి, యూజీసీ నెట్‌ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశ మొదటి కేబుల్‌ స్టేడ్‌ రైలు వంతెన అయిన అంజీ ఖాడ్‌ ఎక్కడ ఉంది?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ ఎల్‌డీసీ 2025)

1) జమ్మూ కశ్మీర్‌     2) హిమాచల్‌ ప్రదేశ్‌

3) రాజస్థాన్‌        4) ఉత్తరాఖండ్‌

సమాధానం: 1

2. కిందివాటిలో భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే వంతెన ఏది?

(డీఎఫ్‌సీసీఐఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆపరేటింగ్, 2018)

1) నెహ్రూ సేతు      2) హావ్‌లాక్‌ వంతెన

3) వెంబనాడ్‌ వంతెన   4) గోదావరి ఆర్చ్‌ వంతెన

సమాధానం: 3

3. భారతదేశ అత్యంత పొడవైన సముద్ర వంతెన అయిన ‘అటల్‌ సేతు’ను ప్రధాని నరేంద్ర మోదీ 2024, జనవరిలో ఎక్కడ ప్రారంభించారు?

(సీఎస్‌ఐఆర్‌-సీఎల్‌ఆర్‌ఐ జేఎస్‌ఏ 2025)

1) చెన్నై     2) కొచ్చి        3) ముంబయి  4) కోల్‌కతా

సమాధానం: 3

4. నదీతలం నుంచి చినాబ్‌ రైలు వంతెన ఎత్తు ఎంత? 

(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2025)

1) 359 మీ.    2) 859 మీ.  3) 478 మీ.   4) 300 మీ. 

సమాధానం: 1

5. Vembanad is
(HTET TGT Social Studies 2014)
1) A Sea Port            2) Lagoon Lake
3) Mountain peak            4) Multipurpose project
Ans: 2
6. Which of the following combinations is NOT correct?
(SSC CGL 2022)
1) Wular lake – Kashmir        2) Vembanad lake – Maharashtra
3) Chilika lake – Odisha        4) Naini lake – Uttarakhand
Ans: 2
7. Vembanad lake is located in which of the following states?
(SSC Stenographer 2021)
1) Tamil Nadu         2) Kerala         3) Andhra Pradesh         4) Karnataka
Ans: 2 
8. Jayprakash bridge (J. P. Setu) is situated on which of the following river?
(SSC CGL 2025)
1) Saryu        2) Ghaghra        3) Ganga        4) Yamuna
Ans: 3

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram