భారత్‌లోని ప్రధాన గిరిజన తెగలు - విశేషాలు (పార్ట్‌ - 1)

భారత్‌లోని ప్రధాన గిరిజన తెగలు - విశేషాలు (పార్ట్‌ - 1)

నాగరిక సమాజానికి దూరంగా నివసిస్తూ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను పాటించే  గిరిజనులు అనాదిగా కొండలు, అటవీ ప్రాంతాల్లోనే జీవనం సాగిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక గిరిజన జనాభా ఆఫ్రికాలో ఉంది. అక్కడ 3వేలకుపైగా గిరిజన తెగలు, 30 శాతానికి పైగా గిరిజన సమూహాలున్నాయి. దేశాల విషయానికొస్తే చైనా మొదటిస్థానంలో ఉండగా, భారత్‌ రెండో ర్యాంకులో ఉంది. భారత సమాజంలో గిరిజన తెగలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. మన దేశం వివిధ తెగలు, జాతుల సమ్మేళనంగా ప్రసిద్ధి చెందింది. ఈ సమూహాలకు సామాజికంగా, సాంస్కృతికంగా అనేక ప్రత్యేకతలున్నాయి. పోటీపరీక్షల కోణంలో వీటి గురించి తెలుసుకుందాం..!

  • గిరిజనులను ఆంగ్లంలో ‘ట్రైబ్స్‌’ అంటారు. ఇది ‘ట్రైబస్‌’ అనే రోమన్‌ పదం నుంచి వచ్చింది. గిరి అంటే కొండ. కాబట్టి కొండ ప్రాంతాల్లో నివసించే వారిని గిరిజనులు (ఆదివాసీలు)గా పిలుస్తారు. 1881లో బ్రిటిష్‌-ఇండియాలో ప్రచురితమైన ఇంపీరియల్‌ గెజెటియర్‌ ఆఫ్‌ ఇండియా (Imperial Gazetteer of India) ప్రకారం, తెగ అనేది ఒకే పేరును కలిగి, ఒకే మాండలికాన్ని మాట్లాడుతూ, ఒకే భౌగోళిక ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాల సమూహాన్ని సూచిస్తుంది.
  • ప్రపంచంలో తొలిసారిగా గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు చేసినవారు లూయిస్‌ హెన్రీ మోర్గాన్‌. ఈయన గ్రంథం ‘ది ఏన్షియంట్‌ సొసైటీ’. భారతదేశంలో గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు చేసినవారు వెన్నెలకంటి రాఘవయ్య. ఈయన గ్రంథం ‘ట్రైబ్స్‌ ఇన్‌ ఇండియా’. గిరిజనుల్లో మరింత వెనుకబడి, నాగరికతకు దూరంగా ఉన్న వర్గాలు ఆదిమ గిరిజనులు. వీరిని ప్రస్తుతం పర్టిక్యులర్లీ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌ (పీవీటీజీ) అని పిలుస్తున్నారు.
  • భారత రాజ్యాంగం గిరిజనుల్లోని అన్ని తెగలను షెడ్యూల్డ్‌ తెగలుగా నిర్వచించలేదు. రాజ్యాంగంలోని 342, 366(25) ఆర్టికల్స్‌ షెడ్యూల్డ్‌ తెగలుగా ఎవరిని గుర్తించాలో పేర్కొన్నాయి. ఆర్టికల్‌ 342 ప్రకారం షెడ్యూల్డ్‌ తెగలు లేదా గిరిజనులు అంటే గిరిజనుల్లోని కొన్ని తెగలు, కొన్ని వర్గాలు లేదా అన్ని వర్గాలు/అన్ని తెగలు. రాజ్యాంగంలో వీరి అభ్యున్నతి కోసం కొన్ని ఆర్టికల్స్‌ను నిర్దేశించారు. 
  • 1991 నాటి రాయ్‌బర్మన్‌ కమిషన్‌ ప్రకారం దేశంలో మొత్తం గిరిజన తెగల సంఖ్య 427. వారి జనాభా 6.776 కోట్లు (8.08%). ఆంథ్రొపాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా లెక్కల మేరకు 314 తెగలు ఉన్నాయి. భారత ప్రభుత్వం 1950లో 212 షెడ్యూల్డ్‌
  • తెగలను నమోదు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం షెడ్యూల్డ్‌ తెగల జనాభా సుమారు 10.42 కోట్లు (8.6%). ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్‌ (14.7%), తక్కువగా ఉన్న రాష్ట్రం సిక్కిం (0.2%).    

రాజ్యాంగంలో గిరిజనుల అభ్యున్నతికి నిర్దేశించిన వివిధ ఆర్టికల్స్, భారతదేశంలోని ప్రధాన గిరిజన తెగలు, ఇతర ముఖ్యాంశాలతోపాటు గతంలో ఈ టాపిక్‌పై   పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఏది?

(ఝార్ఖండ్‌ సివిల్‌ సర్వీస్, 2021)

1) గోండ్‌    2) కోల్‌     3) భిల్‌    4) సంతాల్‌

సమాధానం: 3

2. 2011 జనాభా లెక్కల ప్రకారం కింది ఏ రాష్ట్రాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2022)

1) పశ్చిమ బెంగాల్‌     2) మహారాష్ట్ర

3) పంజాబ్‌          4) అస్సాం

సమాధానం: 3

3. గిరిజన జనాభా కింది ఏ ప్రాంతంలో అత్యధికంగా ఉంది?

(బిహార్‌ ఎస్‌టీఈటీ టీజీటీ (సోషల్‌ సైన్స్‌), 2023)

1) ఆఫ్రికా      2) భారతదేశం

3) నేపాల్‌      4) చైనా

సమాధానం: 1

4. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారత్‌లో షెడ్యూల్డ్‌ తెగల జనాభా ఎంత?

(ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, 2025)

1) 15.45 కోట్లు        2) 8.45 కోట్లు

3) 10.42 కోట్లు         4) 5.45 కోట్లు

సమాధానం: 3

5. Which state in India has the largest scheduled tribe population as per the 2011 Census?
(SSC MTS 2024)
1) Odisha        2) Madhya Pradesh        3) Jharkhand        4) Chhattisgarh
Ans: 2
6. Who was the compiler of the Imperial Gazetteer?
(UPPSC RO/ARO (General Studies, Paper-I) 2020)
1) Colin Clark            2) William Wilson Hunter
3) Charles Elliott            4) William Digly
Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram