భారతదేశంలో ప్రధాన వంతెనలు

భారతదేశంలో ప్రధాన వంతెనలు

(పార్ట్‌ - 1)

సమాజాలను అనుసంధానించడంలో, వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో, ప్రయాణ సమయాలను తగ్గించడంలో వంతెనలు కీలకపాత్ర పోషిస్తాయి. మన దేశంలో ఉద్ధృతంగా ప్రవహించే నదులు, లోతైన లోయలు, అల్లకల్లోలంగా ఉండే సముద్రం లాంటి సహజ అడ్డంకులను అధిగమించడానికి అనేక బ్రిడ్జ్‌ల నిర్మాణం జరిగింది. ఇవన్నీ మన ఇంజినీరింగ్‌ నైపుణ్యాలకు సాక్ష్యాలు. అంతేకాక ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని ఏర్పరచడంలో, సంస్కృతీ-సంప్రదాయాల మార్పిడిలో, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి.  

ధోలా - సాధియా వంతెన

  • దీన్ని ‘భూపేన్‌ హజారికా సేతు’ అని కూడా పిలుస్తారు. 9.15 కి.మీ. పొడవైన ఈ వంతెన ఉత్తర అస్సాం, తూర్పు అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య మొట్టమొదటి శాశ్వత రహదారి అనుసంధానాన్ని అందిస్తుంది. టిన్సుకియా జిల్లాలోని ధోలాను ఉత్తరాన ఉన్న సాదియాతో కలుపుతుంది. బ్రహ్మపుత్ర నది ప్రధాన ఉపనదుల్లో ఒకటైన లోహిత్‌ నదిపై దీన్ని నిర్మించారు. ఇది భారతదేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా రికార్డు సృష్టించింది. 

దిబాంగ్‌ నదీ వంతెన

  • సికాంగ్‌ వంతెన అని కూడా అంటారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దిబాంగ్‌ నదిపై ఉంది. ఇది బ్రహ్మపుత్రకు ఉపనది. 6.2 కి.మీ.పొడవైన ఈ వంతెన బొమ్జిర్, మాలెక్‌ గ్రామాలను కలుపుతూ, తూర్పు సరిహద్దు ప్రాంతాలకు ఏడాది పొడవునా అనుసంధానాన్ని అందిస్తుంది. 60 టన్నుల ప్రధాన యుద్ధ ట్యాంకులను మోయడానికి దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.  

మహాత్మా గాంధీ సేతు

  • దీన్ని గాంధీ సేతు లేదా గంగా సేతు అని కూడా పిలుస్తారు. ఈ వంతెనను బిహార్‌ రాష్ట్రంలోని గంగా నదిపై నిర్మించారు. ఇది దక్షిణాన ఉన్న పట్నాను, ఉత్తరాన ఉన్న హాజీపూర్‌ను కలుపుతుంది. ఇది జాతీయ రహదారి 19లో భాగంగా ఉంది.దీని పొడవు 5.6 కి.మీ. ఇది నేటికీ బిహార్‌లో ఒక పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.

విక్రమశిల సేతు

  • దీన్ని ఉత్తర్‌ ప్రదేశ్‌ స్టేట్‌ బ్రిడ్జ్‌ కార్పొరేషన్‌ నిర్మించింది. బిహార్‌లోని గంగా నదిపై నిర్మించిన ఈ వంతెన పొడవు 4.7 కి.మీ. ఇది భాగల్‌పూర్‌ను పుర్నియా, కతిహార్‌తో కలుపుతుంది. ఇది జాతీయ రహదారి 80, 31లను కలుపుతూ దక్షిణ బిహార్, కోసి-సీమాంచల్‌ ప్రాంతాల మధ్య రాకపోకలకు అనువుగా ఉంది. ప్రాచీన విక్రమశిల విశ్వవిద్యాలయం పేరుమీదుగా దీనికి ఆ పేరు పెట్టారు.   
బాంద్రా - వర్లీ సీలింక్, బోగిబీల్‌ వంతెనలు, ఆయా వంతెనల ప్రారంభోత్సవ తేదీలు, నిర్మాణ ఖర్చు తదితర సమాచారంతోపాటు టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, ఐటీబీపీ హెడ్‌కానిస్టేబుల్‌ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 30కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన  ప్రశ్నలు

1. అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లను కలిపే వంతెన?
(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ సీఆర్‌ఈ, 2025)

1. జైస్వాల్‌ వంతెన               2. ధోలా - సాదియా వంతెన

3. బోగిబీల్‌ వంతెన              4. తీస్తా - సాదియా వంతెన

సమాధానం: 2

2. భారతదేశంలో అత్యంత పొడవైన నదీ వంతెన అయిన ధోలా - సాదియాను కింది ఏ నదిపై నిర్మించారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ, 2021)

1. గంగ                 2. యమున

3. గోదావరి               4. బ్రహ్మపుత్ర

సమాధానం: 4

3. 2017, మేలో ప్రారంభించిన ధోలా - సాదియా వంతెన పొడవు?
(యూపీపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్, 2017)

1. 12.15 కి.మీ.   2. 11.15 కి.మీ.

3. 10.15 కి.మీ.   4. 9.15 కి.మీ.

సమాధానం: 4

4. On which river is the bridge 'Mahatma Gandhi Setu' build?
(JKSSB SI Official Paper 2022)

1. Ganga        2. Satluj        3. Yamuna        4. Godavari

Ans: 1

5. Which of the following bridges is constructed over the Brahmaputra River in India?
(RRB JE CE 2025)

1. Dhola-Sadiya Bridge        2. Howrah Bridge

3. Mahatma Gandhi Setu       4. Pamban Bridge

Ans: 1

6. The Indian Army constructed the longest suspension bridge called ‘Maitri’ across which river?
(RRB Pharmacist Exam Paper 2019)

1. Narmada        2. Indus        3. Brahmaputra        4. Ganges

Ans: 2

7. Which iconic cable-stayed bridge in Mumbai showcases architectural excellence and is named after a former Prime Minister?
(OSSSC CRE 2025)

1. Bandra-Worli Sea Link        2. Indira Gandhi Bridge

3. Atal Setu                 4. JLN Bridge

Ans: 1 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram