భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్‌ - 4)

భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్‌ - 4)

సహజంగా ఉన్న రాతిని తవ్వి నిర్మాణాలు, గుహలు, శిల్పాలను సృష్టించడాన్ని రాతి శిల్పకళ (Rock-cut architecture) అంటారు. ఇవన్నీ భారతీయ శిల్పుల కళాదృష్టిని, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఈ గుహల వాస్తుశిల్పంలో క్లిష్టమైన చెక్కడాలు, శిల్పాలు, చిత్రలేఖనాలు ఉన్నాయి. ఇవి ఆనాటి మత, సామాజిక, కళాత్మక అంశాలపై ప్రస్తుత తరాలకు అవగాహన కల్పిస్తాయి. గత భాగాల్లో రాతిశిల్ప కళ అంటే ఏమిటి - దాని చారిత్రక పరిణామం - రకాలతోపాటు భారతదేశంలో ముఖ్యమైన గుహల సమాచారం  చూశారు. పార్ట్‌-4లో ఇతర గుహల గురించి తెలుసుకుందాం.

పాండవలేని గుహలు  

మహారాష్ట్రలోని నాసిక్‌కు దక్షిణంగా సుమారు 8 కి.మీ. దూరంలో ముంబయి - ఆగ్రా జాతీయ రహదారి వెంట ఉన్న త్రిరశ్మి కొండలపై ఉన్నాయి. వీటిని త్రిరశ్మి గుహలు లేదా నాసిక్‌ గుహలు అని కూడా పిలుస్తారు. క్రీ.పూ.250 నుంచి క్రీ.శ.600 మధ్య కాలంలో వీటిని నిర్మించారు. ఇవి మొత్తం 24 గుహల సమూహం. ఇవన్నీ బౌద్ధ మతంలోని హీనయాన శాఖకు చెందిన ఆచారాలు, విషయాలను ప్రతిబింబిస్తాయి. ఇవి ఆధునిక యుగంలో 1823లో మొదటిసారి వెలుగులోకి వచ్చాయి.

మహాబలిపురంలోని స్మారక కట్టడాల సమూహం

మహాబలిపురం (మామల్లపురం)లోని కట్టడాలు గొప్ప రాతి శిల్పకళ (Rock-cut architecture’)కు నిదర్శనం. ఇది తమిళనాడులోని కోరమండల్‌ తీరంలో ఉన్న చారిత్రక ఆలయ సముదాయం. వీటిని క్రీ.శ.700 నుంచి క్రీ.శ.728 కాలంలో పల్లవ రాజు నరసింహవర్మన్‌ 2 (నరసింహుడు) కాలంలో నిర్మించారు. యునెస్కో 1984లో ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. 

జునాగఢ్‌ గుహలు

ఇవి బౌద్ధ గుహల సమూహాలు. గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో ఉన్నాయి. బౌద్ధ సన్యాసులు నివాసాలుగా ఉపయోగించడానికి చెక్కిన మూడు వేర్వేలు గదులే ఈ గుహలు. ఇందులో ఊపర్‌కోట్‌ గుహలు, ఖప్రా కోడియా గుహలు, బాబా ప్యారే గుహలు ఉన్నాయి. వీటి నిర్మాణం చక్రవర్తి అశోకుడి కాలం నుంచి క్రీ.శ.1 - 4వ శతాబ్దాల వరకు సాగింది.

పీతల్‌ఖోరా గుహలు 

మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల శ్రేణిలో ఉన్న సాత్మల పర్వత శ్రేణిలో ఉన్నాయి. ఇది క్రీ.పూ.3వ శతాబ్దానికి చెందినవి. 14 రాతి గుహల స్మారక కట్టడాలతో కూడిన ఒక పురాతన బౌద్ధ క్షేత్రం ఇది. భారతదేశంలో రాతిశిల్ప కళకు తొలి ఉదాహరణల్లో ఇది ఒకటి. ఇది ఎల్లోరా నుంచి సుమారు 40 కి.మీ. దూరంలో ఉంది. 

మస్రూర్‌ రాతిశిలా దేవాలయం, ఉండవల్లి గుహలు, శివలేని గుహలు - వాటి ప్రత్యేకతలతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2, యూపీఎస్సీ సివిల్స్, ఎస్‌ఎస్‌సీ, ఎన్‌టీపీసీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 40కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఊపర్‌కోట్‌ బౌద్ధ గుహలు ఎక్కడ ఉన్నాయి?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్, 2020)

1) కొచ్చి       2) భోపాల్‌

3) దెహ్రాదూన్‌   4) జునాగఢ్‌

సమాధానం: 4

2. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన మహాబలిపురం స్మారక కట్టడాల సమూహం కింది ఏ రాష్ట్రంలో ఉంది?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్, 2020)

1) తమిళనాడు     2) కేరళ

3) మహారాష్ట్ర      4) కర్ణాటక

సమాధానం: 1

3. తమిళనాడులోని మహాబలిపురం స్మారక కట్టడాల సమూహాన్ని ఎవరు నిర్మించారు?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2016)

1) చోళులు            2) పాండ్యులు

3) చాళుక్యులు          4) పల్లవులు

సమాధానం: 4

4. ఉండవల్లి గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

(డీఎస్‌ఎస్‌స్‌బీ డీఓఈ పీఆర్‌టీ, 2022)

1) అరుణాచల్‌ ప్రదేశ్‌            2) మధ్యప్రదేశ్‌

3) ఆంధ్రప్రదేశ్‌                4) హిమాచల్‌ ప్రదేశ్‌

సమాధానం: 3

5. The famous Pandav Leni Caves is located in which of the following states?
(SSC MTS, 2023) 
1) Odisha        2) Kerala        3) Bihar        4) Maharashtra
Ans: 4 
4. Pandav Caves are found in ______.
(MP Police Constable, 2016)
1) Morena        2) Umaria        3) Bagh        4) Pachmarhi
Ans: 4
6. Which of the following statements about Viharas is/are correct?
i) Viharas consist of a verandas, cell and hall around the walls of the hall.
ii) Ajanta cave and Nashik cave are important parts of Vihara architecture.
(SSC MTS, 2024)
1) Neither i nor ii    2) Both i and ii        3) Only ii        4) Only i
Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram