గవర్నర్‌ జనరల్స్‌ - వైస్రాయ్‌లు (పార్ట్‌ - 1)

గవర్నర్‌ జనరల్స్‌ - వైస్రాయ్‌లు (పార్ట్‌ - 1)

బ్రిటన్‌ ఒక చిన్న ద్వీప దేశమైనప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా దాని సామ్రాజ్యవాదాన్ని విస్తరించగలిగింది. ‘సూర్యుడు అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం (The Sun Never Sets On The British Empire)’ అనే నానుడి వారి రాజ్య విస్తృతిని తెలుపుతుంది. మన దేశంలో వ్యాపారం కోసం అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ ఇక్కడి సంస్థానాల అనైక్యతను, పాలకుల కలహాలను తనకు అనుకూలంగా మార్చుకుంది. ఆధునిక యుద్ధ రీతులతో ఒక్కో సంస్థానాన్ని జయిస్తూ, సామ్రాజ్యాన్ని విస్తరించింది. తమ వలస రాజ్యాల్లో ఏర్పాటు చేసిన బలమైన, సమర్థవంతమైన అధికార యంత్రాంగం కారణంగానే బ్రిటన్‌ దీన్ని చేయగలిగింది. (ఈ కలర్‌లో ఇచ్చింది పేజీకి మాత్రమే. పోస్ట్‌కి వద్దు) భారతదేశంలో గవర్నర్‌ - జనరల్స్, వైస్రాయ్‌ల ద్వారా ఆంగ్లేయులు తమ నియంత్రణను నెలకొల్పారు. కేవలం ఆధిపత్యాన్ని చెలాయించడమే కాకుండా వివిధ సాంఘిక సంస్కరణలు, ప్రజోపయోగ కార్యకలాపాలపైనా దృష్టి సారించారు.

  • క్రీ.శ.1600 డిసెంబరు 31న ఎలిజబెత్‌ మహారాణి అనుమతితో బ్రిటన్‌కు చెందిన ప్రైవేట్‌ వర్తకుల సంఘం ఈస్టిండియా కంపెనీ పేరుతో మన దేశంలో వర్తక, వాణిజ్యం నిర్వహించుకునే అవకాశాన్ని పొందింది. మొదట బెంగాల్‌ను ఆక్రమించి చివరికి మొత్తం భారతదేశాన్ని గుప్పిట్లో పెట్టుకుంది. దాదాపు మూడు శతాబ్దాల కాలంలో బ్రిటన్‌ వాణిజ్య శక్తి స్థాయి నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా ఎదిగింది.
  • బ్రిటిష్‌ సామ్రాజ్య విస్తరణలో గవర్నర్‌ జనరల్స్‌ - వైస్రాయ్‌లు ఎంతగానో కృషి చేశారు. బెంగాల్‌ గవర్నర్‌ జనరల్, భారతదేశ గవర్నర్‌ జనరల్, వైస్రాయ్‌ అనే మూడు పదవులతో వారు పూర్తి భారతదేశాన్ని నియంత్రించారు. ఈస్టిండియా కంపెనీ భారతదేశానికి వచ్చినప్పుడు, అది ‘బెంగాల్‌ గవర్నర్‌’ అనే పదవి ద్వారా బెంగాల్‌ను నియంత్రించేది. రాబర్ట్‌ క్లైవ్‌ బెంగాల్‌కు మొదటి గవర్నర్‌గా వ్యవహరించారు.  
  • బొంబాయి, మద్రాస్‌ లాంటి ఇతర ప్రెసిడెన్సీలకు కూడా ప్రత్యేక గవర్నర్లు ఉండేవారు. 1773 నాటి రెగ్యులేటింగ్‌ చట్టం ఆమోదం పొందాక బెంగాల్‌ గవర్నర్‌ పదవిని ‘బెంగాల్‌ గవర్నర్‌ - జనరల్‌’గా మార్చారు. బెంగాల్‌ మొదటి గవర్నర్‌ - జనరల్‌గా వారెన్‌ హేస్టింగ్స్‌ వ్యవహరించారు. ఈ చట్టం ద్వారా, ఇతర ప్రెసిడెన్సీల గవర్నర్లు కూడా బెంగాల్‌ గవర్నర్‌ - జనరల్‌ ఆధ్వర్యంలోనే పనిచేశారు.
  • బ్రిటిష్‌ ప్రభుత్వం 1833 చార్టర్‌ చట్టం ద్వారా బెంగాల్‌ గవర్నర్‌ పదవిని ‘భారతదేశ గవర్నర్‌ జనరల్‌’గా మార్చింది. దీని ద్వారా అప్పటి వరకు బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్‌ భారతదేశ తొలి గవర్నర్‌ జనరల్‌ అయ్యారు. 1857 సిపాయి తిరుగుబాటు అణచివేత తర్వాత 1858, నవంబరు 1న బ్రిటిష్‌ రాణి విక్టోరియా భారతదేశ పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తూ ఒక ప్రకటన జారీ చేశారు. దీని ప్రకారం, భారతదేశ గవర్నర్‌ జనరల్‌ పదవిని భారతదేశ వైస్రాయ్‌గా మార్చారు. భారతదేశ మొదటి వైస్రాయ్‌ లార్డ్‌ కానింగ్‌.

రాబర్ట్‌క్లైవ్, లార్డ్‌ వారెన్‌ హేస్టింగ్స్, లార్డ్‌ కారన్‌ వాలీస్, సర్‌ జాన్‌ షోర్, లార్డ్‌ వెల్లస్లీ, లార్డ్‌ జార్జ్‌ బార్లో, లార్డ్‌ మింటో తదితరులు చేపట్టిన కార్యక్రమాలు, అనుసరించిన విధానాలతోపాటు ఏపీ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్, ఎస్‌ఎస్‌సీ - ఎంటీఎస్, సీహెచ్‌ఎస్‌ఎల్‌; యూపీఎస్సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్రలు

1. రాబర్ట్‌ క్లైవ్‌ కింది ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడు?

(ఎస్‌ఎస్‌సీ జీడీ, 2021)

1) 1543   2) 1733   3) 1743   4) 1643

సమాధానం: 3

2. ‘భారతదేశ విజేత’ అని కింది ఎవర్ని పిలుస్తారు?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ పీజీటీ, 2021)

1) విలియం బెంటిక్‌    2) లార్డ్‌ వెల్లస్లీ

3) వారెన్‌ హేస్టింగ్స్‌    4) రాబర్ట్‌ క్లైవ్‌

సమాధానం: 4

3. వారెన్‌ హేస్టింగ్స్‌ కింది ఏ సంవత్సరంలో బెంగాల్‌ మొదటి గవర్నర్‌ జనరల్‌గా నియమితులయ్యారు?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ గ్రేడ్‌ 4, 2019)

1) 1771       2) 1778       3) 1775       4) 1773

సమాధానం: 4

4. 1760లో సొసైటీ ఆఫ్‌ ట్రేడ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?

(ఎంహెచ్‌ ఎస్‌ఈటీ, 2024)

1) రాబర్ట్‌ క్లైవ్‌            2) వారెన్‌ హేస్టింగ్స్‌

3) మీర్‌ జాఫర్‌           4) జార్జ్‌ పిగోట్‌

సమాధానం: 1

5. Which of the following statements is correct?
I. Robert Clive had come to Madras from England in 1743 at the age of 18.
II. After the battle of Buxar, the East India Company appointed Residents in Indian states.
(SSC MTS, 2022)
1) Only I        2) Neither I nor II        3) Only II        4) Both I and II
Ans: 4
6. The details of the conspiracy hatched by Clive against Siraj-ud-Daulah were settled through :
(Odisha B.Ed. Entrance Exam (Arts), 2025)
1) Rai Durlab        2) Manik Chand        3) Amir Chand        4) Jagat Seth
Ans: 3
7. What tragic incident happened in the life of Robert Clive in 1774?
(SSC CHSL, 2025)
1) He was assassinated        
2) He committed suicide.
3) He was exiled to Burma
4) He was given death penalty on the charges of corruption
Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram