భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ కుట్ర కేసులు

భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ కుట్ర కేసులు

బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం వివిధ వర్గాల వారు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. వీరిలో కొందరు సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను తరిమికొట్టాలని భావించారు. వీరినే విప్లవకారులు లేదా సమరశీల జాతీయవాదులుగా పేర్కొంటారు. వీరు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయడానికి వివిధ సంస్థలు/ సంఘాలను నెలకొల్పారు. 1906 నుంచి 1920  మధ్య సాగిన జాతీయోద్యమ దశను ‘తీవ్రవాద జాతీయోద్యమం’ అంటారు. ప్రభుత్వం అనేక హింసాత్మక చర్యలు చేపట్టి, ఎందరో విప్లవకారులను ఉరి తీయించింది. వీటినే కుట్ర కేసులుగా పేర్కొంటారు.  

అలీపూర్‌ కుట్ర కేసు

  • 1908 నుంచి 1909 మధ్య జరిగిన భారత స్వాతంత్య్రోద్యమంలోని ఒక కీలకమైన చట్టపరమైన, రాజకీయ సంఘటనగా ఈ కేసును పేర్కొంటారు. దీన్నే మణికతోల్లా బాంబు కుట్ర అని కూడా పిలుస్తారు. బ్రిటిష్‌ మెజిస్ట్రేట్‌ డగ్లస్‌ కింగ్స్‌ ఫోర్డ్‌పై బెంగాల్‌కు చెందిన జాతీయవాదులు - ఖుదీరామ్‌ బోస్, ప్రఫుల్ల చాకి చేసిన హత్యాయత్నం అనంతరం ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

దిల్లీ కుట్ర కేసు

  • దీన్నే దిల్లీ - లాహోర్‌ కుట్ర కేసు అని కూడా అంటారు. 1912, డిసెంబరు 23న రాస్‌ బిహారి బోస్, బసంత్‌ కుమార్‌ బిశ్వాస్, మాస్టర్‌ అమార్‌ చంద్, భాయ్‌ బాల్ముకుంద్‌ సహా విప్లవ నాయకులు వైస్రాయ్‌ లార్డ్‌ హార్డింజ్‌పై బాంబు దాడి చేశారు. అతడు ప్రాణాలతో బయటపడినప్పటికీ ఈ సంఘటన ఆ కాలంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా జరిగిన ఒక ధిక్కార చర్యగా నిలిచింది.

కాన్పూర్‌ కుట్ర కేసు

  • దీన్ని కాన్పూర్‌ బోల్ష్‌విక్‌ కుట్ర కేసు అని కూడా అంటారు. 1924లో బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రారంభించిన వివాదాస్పద కోర్టు కేసుగా దీన్ని పేర్కొంటారు. ఈ కేసు ఎం.ఎన్‌.రాయ్, ముజాఫర్‌ అహ్మద్, ఎస్‌.ఎ.డాంగే, షౌకత్‌ ఉస్మానీ, నళినీ గుప్తా, సింగరవేలు చెట్టియార్‌ లాంటి విప్లవకారులను లక్ష్యంగా చేసుకుంది. హింసాత్మక విప్లవం ద్వారా భారతదేశంలోని బ్రిటిష్‌ పాలనను కూల్చడానికి వీరు కుట్ర పన్నారని వారిపై అభియోగాలు మోపారు.

కాకోరి కుట్ర కేసు

  • దీన్ని కాకోరి రైలు దోపిడీ అని కూడా అంటారు. తమ విప్లవ కార్యక్రమాలకు నిధులు సేకరించడానికి హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌ఏ)కి చెందిన విప్లవకారుల బృందం చేపట్టిన రైలు దోపిడీయే ఈ కేసుకు మూలం. భారతీయులపై విధించిన భారీ పన్నుల ద్వారా బ్రిటిష్‌ ప్రభుత్వం పొందిన ఆదాయాన్ని దోచుకోవడం ద్వారా వారి ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయాలనేది హెచ్‌ఆర్‌ఏ లక్ష్యం. ఈ సంఘం ‘ప్రజా విప్లవం ప్రజల కోసమే’ అనే నినాదాన్ని ప్రతిపాదించింది.  
ఆయా కుట్ర కేసుల నేపథ్యాలతోపాటు లాహోర్, మీరట్‌ కుట్ర కేసులు, గతంలో ఈ అంశంపై తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్, ఏపీ హైకోర్ట్‌ అసిస్టెంట్, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌ లెవల్, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్‌ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కాకోరి రైలు కుట్ర ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
(కేపీఎస్సీ గ్రూప్‌ సి, 2021)

1. భగత్‌సింగ్‌                  2. రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌

3. చంద్రశేఖర్‌ ఆజాద్‌             4. ఉద్దమ్‌ సింగ్‌

సమాధానం: 2

2. ముజాఫర్‌ బాంబు కుట్ర కేసు కింది ఎవరికి సంబంధించింది?
(ఝార్ఖండ్‌ సివిల్‌ సర్వీసెస్, 2015)

1. సావర్కర్‌                2. అజిత్‌ సింగ్‌

3. ప్రఫుల్ల చాకి              4. బిపిన్‌ చంద్రపాల్‌

సమాధానం: 3

3. భారతదేశ రాజధానిని కోల్‌కత్తా నుంచి దిల్లీకి ఏ సంవత్సరంలో మార్చారు?
(డబ్ల్యూబీసీఎస్‌ ప్రిలిమ్స్, 2015)

1. 1905   2. 1911   3. 1931  4. 1947

సమాధానం: 2

4. బ్రిటిష్‌ ఇండియా రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చే సమయంలో కింది ఎవరు భారతదేశ వైశ్రాయ్‌గా ఉన్నారు?
(రాజస్థాన్‌ సీఈటీ, 2023)

1. లార్డ్‌ రిప్పన్‌      2. లార్డ్‌ డల్హౌసీ

3. లార్డ్‌ హార్డింజ్‌     4. లార్డ్‌ డఫ్రిన్‌

సమాధానం: 3

5. The Alipore Bomb Case of 1908 is associated with which Indian revolutionary?
(RRB NTPC Graduate Level CBT-I Official Paper 2025)

1) Aurobindo Ghosh        2) Jatin Das        3) Khudiram Bose        4) Bhagat Singh

Ans: 1

6. Who among the following was not punished for the Kakori incident (1925)?
(Rajasthan Police Constable Official Paper 2020)

1) Roshan Singh                2) Rajendra Lahiri

3) Ashfaqullah Khan            4) Chandrashekhar Azad

Ans: 4

7. Revolutionary hero Ashfaqulla Khan was sentenced to death for _________.
(SSC CPO 2022)

1) the murder of Saunders        2) burning of the Chauri Chaura police station

3) the Kakori Train Robbery      4) the Alipore Conspiracy Case

Ans: 3

8. Which revolutionary leader attempted to assassinate Lord Hardinge?
(SSC GD Constable, 2025)

1) Chandra Shekhar Azad         2) Rash Behari Bose    

3) Bhagat Singh               4) Khudiram Bose

Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram