భారతదేశంలోని ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు

భారతదేశంలోని ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అనేది ఒక మార్కెట్‌ వేదిక. ఇక్కడ వ్యాపారులు సెక్యూరిటీల (షేర్లు, బాండ్లు, డిబెంచర్లు) కొనుగోలు, విక్రయం చేస్తారు. స్టాక్‌ మార్కెట్‌లో ఇవి అత్యంత ముఖ్యమైన భాగం. ఈ సెక్యూటీల వేలం అనేది క్రమపద్ధతిలో, నియమ నిబంధనలకు లోబడి జరుగుతుంది. మన దేశంలో అనేక క్రియాశీల స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ఉన్నాయి. మూలధన మార్కెట్లలో కీలకపాత్ర పోషించే ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల వ్యవస్థ భారతదేశ ఆర్థిక రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా మన దేశ ఆర్థికవృద్ధి, పెట్టుబడి కార్యకలాపాల్లో కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి.

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌

  • సెక్యూరిటీ కాంట్రాక్టుల (క్రమబద్ధ) చట్టం - 1956 ప్రకారం ‘సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాల వ్యాపారాన్ని నియంత్రించడానికి లేదా సులభతరం చేయడానికి ఏర్పాటు చేసిన సంఘాన్ని ‘స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌’ అంటారు. నమోదైన లేదా నమోదు కాని వ్యక్తులు ఈ సంఘంలో ఉంటారు. ఇది వివిధ కంపెనీల షేర్లను కొనడానికి లేదా అమ్మడానికి ఏర్పాటు చేసిన వేదిక. దేశంలోని ఆర్థిక వాతావరణానికి దీన్ని భారమితిగా పేర్కొంటారు. ఇది దేశ ఆర్థిక ప్రగతిలోనూ ముఖ్య భూమిక పోషిస్తోంది.  
  • 18వ శతాబ్దంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ రుణ సెక్యూరిటీ వ్యాపారాన్ని(trading in loan securities) ప్రారంభించడంతో మన దేశంలో సెక్యూరిటీల వ్యాపారం మొదలైంది. కంపెనీ తన కార్యకలాపాల కోసం మూలధనాన్ని సమీకరించడానికి బాండ్లు, షేర్లు జారీ చేసింది. 1830వ దశకంలో బొంబాయిలో బ్యాంక్, కాటన్‌ ప్రెస్‌ల స్టాక్‌తో కార్పొరేట్‌ షేర్ల ట్రేడింగ్‌ ప్రారంభమైంది. 1850వ దశకంలో 22 మంది స్టాక్‌ బ్రోకర్లు బొంబాయి టౌన్‌ హాల్‌ ఎదురుగా ఒక మర్రిచెట్టు కింద ట్రేడింగ్‌ ప్రారంభించారు.
  • బ్రోకర్ల సంఖ్య పెరిగాక 1874లో దలాల్‌ స్ట్రీట్‌ అని పిలిచే ప్రదేశంలో ట్రేడింగ్‌ స్థిరపడింది. హిందీలో దలాల్‌ స్ట్రీట్‌ అంటే బ్రోకర్‌ స్ట్రీట్‌ అని అర్థం. 1850లో కంపెనీల చట్టం ప్రవేశపెట్టాక, పెట్టుబడిదారులు కార్పొరేట్‌ సెక్యూరిటీలపై ఆసక్తి చూపడం ప్రారంభించారు. 1875లో ‘ది నేటివ్‌ షేర్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌’ అనే సంస్థ ఉనికిలోకి వచ్చింది. 1875, జులై 9న బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)ను స్థాపించారు.
  • 1894లో వస్త్ర మిల్లుల షేర్లలో లావాదేవీలను సులభతరం చేయడానికి అహ్మదాబాద్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటైంది.
  • కలకత్తా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1908లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. తోటలు, జనపనార మిల్లుల షేర్లను ఇందులో ట్రేడింగ్‌ చేసేవారు. 1937, సెప్టెంబరు 4న మద్రాస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అసోసియేషన్‌ (ప్రైవేట్‌) లిమిటెడ్‌ అధికారికంగా ఏర్పాటైంది. ఆర్థిక మార్కెట్‌లను నియంత్రించే లక్ష్యంతో 1988, ఏప్రిల్‌ 12న సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)ని ఒక చట్టబద్ధం కాని సంస్థగా ఏర్పాటు చేశారు. తర్వాత 1992 జనవరి 30న ‘సెబీ చట్టం, 1992’ అమల్లోకి రావడంతో ఇది ఒక చట్టబద్ధమైన సంస్థగా మారింది.
స్టాక్‌ ఎక్స్ఛేంజీల ప్రధాన విధులు, దేశంలోని ఆరు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల సమాచారంతోపాటు తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్, టీఎస్‌పీఎస్‌సీ ఏఎస్‌ఓ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్‌బీఐ ఆఫీస్‌ అటెండెంట్, ఎస్‌బీఐ క్లర్క్‌ మెయిన్స్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్రలు

1. భారతదేశంలో మొదటి వ్యవస్థీకృత స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
(డబ్ల్యూబీసీఎస్‌ మెయిన్స్, 2023)

1) కోల్‌కతా     2) బొంబాయి

3) చెన్నై       4) అహ్మదాబాద్‌

సమాధానం: 2

2. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అనేది కింది దేనికి ఉదాహరణ?
(ఎంపీపీఎస్సీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కామర్స్, 2017)

1) నియంత్రిత మార్కెట్‌         2) అనియంత్రిత మార్కెట్‌

3) స్పాట్‌ మార్కెట్‌            4) అసంఘటిత మార్కెట్‌

సమాధానం: 1

3. సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) చట్టబద్ధం కాని సంస్థగా ఎప్పుడు ఏర్పాటైంది?
(ఎస్‌ఎస్‌సీ జేఈ సీఈ, 2020)

1) 1970   2) 1988   3) 1890   4) 1980

సమాధానం: 2

4. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియాను ఎప్పుడు స్థాపించారు?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2020)

1) 1991   2) 1994   3) 1993   4) 1992

సమాధానం: 4

5. Which of the following institutions plays an important role in reducing information asymmetry in financial markets?
(DSSSB TGT, 2025)

1) Central bank                2) Insurance company

3) Stock exchange            4) Commercial bank

Ans: 3

6. The National Stock Exchange of India Ltd. was established as per the recommendations of _____ report. 
(MPPSC Assistant Professor, 2025)

1) Narasimham Committee        2) Chakravarty Committee

3) Pherwani Committee        4) Chore Committee

Ans: 3

7. In which year was Asia's first stock exchange, Bombay Stock Exchange Limited, established?
(DSSSB TGT, 2025)

1) 1895        2) 1875        3) 1865        4) 1905

Ans: 2

8. The _______ Stock Exchange was the first to be recognized by the Government of India under the Securities Contracts Regulation Act.
(SSC CPO, 2019)

1) Ahmedabad        2) Bombay         3) Madras            4) Calcutta

Ans: 2

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram