పసిడి రుణాల్లో పెరుగుదల

పసిడి రుణాల్లో పెరుగుదల

దేశంలో పసిడి తనఖాపై తీసుకుంటున్న రుణాల విలువ 2025-26 ఆర్థిక సంవత్సరం చివరకు రూ.19.4 లక్షల కోట్లకు చేరిందని అంతర్జాతీయ డేటా, టెక్నాలజీ కంపెనీ ఎక్స్‌పీరియన్‌ రూపొందించిన నివేదిక తెలిపింది. పసిడి ధరలు పెరగడం, ఆభరణాల తనఖాపై ఎక్కువ మొత్తం రుణంగా తీసుకోవడం పెరగడమే ఇందుకు కారణమని విశ్లేషించింది.  2022-23 చివరిలో ఈ రుణాల విలువ రూ.6.3 లక్షల కోట్లే. అంటే మూడేళ్లలోనే పసిడి రుణాల విలువ 3 రెట్లు పెరిగింది. ఈ కాలంలో బంగారం ధర కూడా 144% పెరిగింది. ఇదే సమయంలో ఒక రుణ ఖాతా సగటు రూ.98,000 నుంచి రూ.1.96 లక్షలకు చేరింది.

  • పసిడి రుణాల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల వైపు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని నివేదిక తెలిపింది. ‘గోల్డ్‌ లోన్స్‌ ఇన్‌ ట్రాన్సిషన్‌: మార్కెట్‌ ఎవల్యూషన్‌ అండ్‌ కన్జూమర్‌ ప్యాటర్న్స్‌’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం, ఇప్పటికీ ఈ విభాగంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలకంగానే ఉన్నా ప్రైవేటు సంస్థల వాటా పెరుగుతోంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram