పెరిగిన జీఎస్టీ వసూళ్లు

పెరిగిన జీఎస్టీ వసూళ్లు
  • ఈఏడాది జూన్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2025 జూన్‌లో వసూలైన  రూ.1.71 లక్షల కోట్ల కంటే ఇవి 14% అధికం. దేశీయ విక్రయాలు, దిగుమతుల నుంచి అధిక పన్ను వసూళ్లు నమోదుకావడం వల్లే జూన్‌లో జీఎస్‌టీ వసూళ్లు పెరిగాయని ప్రభుత్వం తెలిపింది.
  • దేశీయ లావాదేవీల నుంచి స్థూల పన్ను వసూళ్లు 6.5% పెరిగి రూ.1.35 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో కేంద్ర సీజీఎస్‌టీ (సీజీఎస్‌టీ) రూ.37,376 కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) రూ.45,116 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.52,282 కోట్లుగా ఉన్నాయి. దిగుమతుల నుంచి జీఎస్‌టీ వసూళ్లు 34.6% అధికమై రూ.60,038 కోట్లకు చేరాయి.
  • రిఫండ్‌లు 29.1% పెరిగి రూ.32,436 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్‌ల సర్దుబాటు అనంతరం నికరంగా జీఎస్‌టీ వసూళ్లు 11.2% పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరాయి. 
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు 8.4% అధికమై  రూ.6.32 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram