భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు జపాన్ ఓపెన్ టైటిల్ నెగ్గింది. 2026, జులై 19న టోక్యోలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె 21-17, 21-17తో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ యమగూచి (జపాన్)ని ఓడించింది. ఈ టైటిల్ చేజిక్కించుకున్న తొలి భారత షట్లర్గా సింధు ఘనత సాధించింది.
2019లో ప్రపంచ ఛాంపియన్షిప్స్ తర్వాత ఆమెకు ఇదే అతిపెద్ద విజయం.