2026 కామన్వెల్త్ క్రీడల ఆరంభ వేడుకల్లో వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను భారత పతాకధారిగా వ్యవహరించనుంది. 2026, జులై 23న గ్లాస్గోలో జరిగే ఆరంభ వేడుకల్లో మీరాబాయి భారత జెండాను మోయనుంది. లవ్లీనా బ్యాటన్ పట్టుకుని నడవనున్నట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తెలిపింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి స్కాట్లాండ్ ఆతిథ్యమివ్వనుంది.