ఎక్కువమంది అథ్లెట్లు డోపింగ్కు పాల్పడిన దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం 162 మంది డోపీలతో నంబర్వన్గా ఉంది. కెన్యా (148), రష్యా (60) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఈ 162 మందిలో డోపింగ్కు పాల్పడి శిక్షను ఎదుర్కొంటున్నవాళ్లతో పాటు డోప్ పరీక్షలను తప్పించుకోవడం, నిషేధిత ఉత్ప్రేరకాల అక్రమ రవాణా, తమ వివరాలు చెప్పడంలో విఫలం కావడం లాంటి తప్పులు చేసినవాళ్లు కూడా ఉన్నారు.