దేశంలోని చిన్న పట్టణాలకూ విమాన సర్వీసులు నిర్వహించేందుకు అమలు చేస్తున్న ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఉడాన్) పథకం తదుపరి దశను ప్రధాని నరేంద్ర మోదీ 2026, జులై 4న ప్రారంభించారు. రాబోయే పదేళ్లలో సుమారు రూ.29,000 కోట్లు ఈ పథకంపై వెచ్చిస్తారు. ఇప్పటివరకు విమాన సేవలు లేని ప్రాంతాలనూ కొత్త పథకంలో అనుసంధానించనున్నారు.
2016, అక్టోబరు 21న ప్రారంభమైన ఉడాన్ పథకం ఇప్పటివరకు 669 మార్గాలను కార్యరూపంలోకి తెచ్చింది.