హిమాచల్ ప్రదేశ్లోని కుల్లూ జిల్లా రోహ్తాంగ్ వద్ద గల అటల్ సొరంగంలో భారత సైన్యానికి చెందిన కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్.. డేర్ డెవిల్స్ బృందం కొత్త ప్రపంచ రికార్డును విజయవంతంగా పూర్తి చేసింది.
ప్రపంచంలోకెల్లా అతి పొడవైన 10 వేల అడుగుల (9.8 కి.మీ.) ఈ హైవే టన్నెల్ను రెండు ద్విచక్ర వాహనాలపై పదిమంది రైడర్లు 9.48 నిమిషాల్లో దాటారు. 10,075 అడుగుల ఎత్తున ఈ విన్యాసం పూర్తి చేసినట్లు ఆర్మీ అధికారులు 2026, జులై 2న తెలిపారు.