వీబీ జీరామ్జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్-గ్రామీణ) పథకాన్ని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో 2026, జులై 2న కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
ఈ పథకం కింద 2026లో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం రూ.7,700 కోట్లు ఇవ్వనుంది. రాష్ట్ర వాటా కింద రూ.4 వేల కోట్లు కలిపి మొత్తం రూ.11,700 కోట్లతో పనులు చేస్తారు. గతంలో రాష్ట్రం వాటా 10 శాతమే ఉండేది. ఇప్పుడు 40 శాతానికి పెరిగింది.