భవిష్యత్తు యుద్ధాల సన్నద్ధతలో భాగంగా డ్రోన్లు, మానవ రహిత వైమానిక వ్యవస్థల్ని నిర్వహించే ప్రత్యేక ‘‘బాజ్ బెటాలియన్’’లను భారత సైన్యం సిద్ధం చేస్తోంది. డ్రోన్లు పోషించగల కీలక పాత్ర గురించి ఆపరేషన్ సిందూర్లో పాఠాలు నేర్చుకున్న నేపథ్యంలో ఈ కొత్త బెటాలియన్ రూపకల్పనకు పూనుకుంది. ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్ల అనివార్యతను ప్రభుత్వం గుర్తించింది. నిఘా సమాచార సేకరణ, కచ్చితత్వంతో కూడిన దాడులు తదితర యుద్ధ తంత్రాల్లో డ్రోన్లను వినియోగించనుంది.