రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2026, జులై 11న విశాఖ తూర్పు నావికాదళం ఎన్14ఏ జెట్టీలో అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ నౌకను ఆయన జాతికి అంకితమిచ్చారు. ఒడిశాలోని పర్వతశ్రేణి ‘మహేంద్రగిరి’ పేరు పెట్టిన ఈ నౌకను 75 శాతానికిపైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఏడాదిన్నరలోనే నౌకాదళంలో దీన్ని చేర్చారు. దీనికి చిహ్నంగా ‘ఘష పక్షి’ని నిర్ణయించారు.