అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు హైదరాబాద్ అంకురం కాస్మోసర్వ్ స్పేస్ సరికొత్త సాంకేతికతను సిద్ధం చేసింది. ‘మిషన్ ఎంబ్రేస్’ పేరుతో నింగిలో రోబోటిక్ పద్ధతిలో ఉపగ్రహాలను పట్టుకునే (సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్) ప్రయోగాన్ని నిర్వహించనుంది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ తొలి కక్ష్య ప్రయోగం ‘మిషన్ ఆగమన్’ ద్వారా జులై 12 - ఆగస్టు 4 మధ్య ఈ పేలోడ్ నింగికి చేరనుంది.