దేశంలోనే తొలిసారి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 తొలి ప్రయోగంలో భారత దిగ్గజ శాస్త్రవేత్తల బొమ్మలను అంతరిక్షంలోకి పంపనున్నారు. ‘మిషన్ ఆగమన్’ పేరిట జులై 12 నుంచి ఆగస్టు 4 మధ్య ఈ ప్రయోగం నిర్వహించనున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ ప్రకటించింది.
‘ఆగమన్’ మిషన్లో తీసుకెళ్లే పేలోడ్లలో మైక్రోఆర్టిస్ట్ అజయ్ 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన చిన్న రాకెట్ ఉంది.