అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్.. మధ్యప్రదేశ్లోని శివపురిలో దక్షిణాసియాలోనే అతి పెద్ద ప్రైవేటు క్షిపణుల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రానున్న మూడేళ్లలో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. మన దేశంలో ప్రైవేటు రంగంలో రాబోతున్న తొలి క్షిపణుల కేంద్రం ఇదే.