సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 అబ్జర్వేటరీ కీలక విషయాన్ని గుర్తించింది. భానుడిలో భారీగా సౌర జ్వాలలు చెలరేగిన సందర్భంలో ఐరన్ ఫోరోసెన్స్ను పరిశీలించింది. సౌర జ్వాలలు సూర్యుడి వెలుపలి వాతావరణమైన కరోనాను వేడెక్కిస్తాయి. దీనివల్ల శక్తిమంతమైన ఎక్స్రేలు వెలువడతాయి.
ఈ ఎక్స్రేలు చాలావరకూ సూర్యుడి వెలుపలికి వచ్చేస్తాయి. కొన్ని మాత్రం భానుడి లోపలికి పయనిస్తాయి. ఈ క్రమంలో అవి సూర్యుడి ఉపరితల పొర అయిన ఫొటోస్పియర్తో చర్యలు జరుపుతాయి. అక్కడ పుష్కలంగా ఉన్న న్యూట్రల్ ఐరన్ రేణువులను తాకినప్పుడు అవి ఎక్స్రే వెలుగు లేదా ఫ్లోరోసెన్స్ను కలిగిస్తాయి.