ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2026, జులై 10న న్యూజిలాండ్ ఆర్థిక రాజధాని ఆక్లాండ్ చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ విమానాశ్రయానికి వచ్చి మోదీకి ఘన స్వాగతం పలికారు. నాలుగు దశాబ్దాల్లో న్యూజిలాండ్ సందర్శనకు భారత ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి.
మోదీ న్యూజిలాండ్ చేరుకోవడానికి ముందే ఆ దేశ ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్కు న్యూజిలాండ్ ఎగుమతి చేస్తున్న వస్తువుల్లో 57శాతం ఉత్పత్తుల మీద ఇకపై ఎలాంటి సుంకాలు ఉండబోవని తెలిపారు.