సీషెల్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ నేషనల్ అసెంబ్లీని (పార్లమెంట్) ఉద్దేశించి ప్రసంగించారు. సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినితో చర్చల్లో పాల్గొన్నారు. మాదకద్రవ్యాల రవాణా, మత్స్య సంపద అక్రమ వేట, సరిహద్దులు దాటి చేసే నేరాలు లాంటి వాటికి కళ్లెం వేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని హెర్మిని పేర్కొన్నారు. మోదీ, హెర్మినిల చర్చల తర్వాత రక్షణ, నౌకాయాన భద్రత, డిజిటల్ చెల్లింపులు, ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయం, విద్య లాంటి రంగాల్లో సహకారంపై 19 ఒప్పందాలు కుదిరాయి. సీషెల్స్ జాతీయ దిన స్వర్ణోత్సవాల్లో గౌరవ అతిథిగా మోదీ పాల్గొన్నారు.