రాజా రామ్మోహన్‌ రాయ్‌ 

రాజా రామ్మోహన్‌ రాయ్‌ 

ఆధునిక భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన ముఖ్య వ్యక్తుల్లో రాజా రామ్మోహన్‌ రాయ్‌ ఒకరు. సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలతో భారతీయ సంస్కృతి పతనమవుతున్న సమయంలో జాతిని మేల్కొలిపి, ఆధునిక యుగం వైపు పయనింపజేసిన తొలి సంఘసంస్కర్త ఆయన. బ్రిటిష్‌ వారి కాలంలో దేశంలో సతీసహగమనాల రద్దు, వితంతు పునర్వివాహాలు, మహిళా విద్యను ప్రోత్సహించడం లాంటివి చేశారు. ఈయన్ను ‘ఆధునిక భారతదేశ పితామహుడు’, ‘భారతీయ పునరుజ్జీవ ఉద్యమ పితామహుడి’గా పేర్కొంటారు. మే 22న రామ్మోహన్‌ రాయ్‌ జయంతి సందర్భంగా పోటీ పరీక్షల నేపథ్యంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.

బాల్యం - తొలి జీవితం

  • రాజా రామ్మోహన్‌ రాయ్‌ బెంగాల్‌లోని రాధానగర్‌లో 1772, మే 22న సంపన్న, సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
  • రాధానగర్‌లోని స్థానిక పాఠశాలలో బెంగాలీ, సంస్కృతం అభ్యసిస్తూ అధికారిక విద్యను ప్రారంభించారు. 1781లో పట్నా వెళ్లి అక్కడ మదర్సాలో పర్షియన్, అరబిక్‌ భాషలు అభ్యసించారు. ఆయన ఖురాన్, సూఫీ యోగుల రచనలు, ప్లేటో - అరిస్టాటిల్‌ల అరబిక్‌ అనువాదాలు చదివారు. అరబిక్‌ భాషలో ఖురాన్‌ను చదివిన రాయ్, తన 16వ ఏట విగ్రహారాధన సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఒక భాష్యాన్ని రచించారు. దీనికి ఆగ్రహించిన రాయ్‌ తండ్రి ఆయన్ను ఇంటి నుంచి వెళ్లగొట్టారు.
  • తర్వాత వారణాసి వెళ్లి సంస్కృతం, వేదాలు, ఉపనిషత్తులు, హిందూ తత్వశాస్త్రంలోని సంక్లిష్టతలను అధ్యయనం చేశారు.
  • చిన్నతనంలోనే ఆయనకు విభిన్న సంస్కృతులు, తత్వశాస్త్రాలతో పరిచయం ఏర్పడింది. ఇవన్నీ ఆయనలోని సంస్కరణవాద ఆలోచనలను గణనీయంగా ప్రభావితం చేశాయి.
  • 1803లో ముర్షిదాబాద్‌కు మారి, బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగం పొందారు. రాయ్‌ ఈస్టిండియా కంపెనీలో అధికారిగా ఉన్న జాన్‌ డిగ్రీ వద్ద పనిచేశారు. ఆయన నుంచి పాశ్చాత్య ఉదారవాదం, హేతుబద్ధమైన ఆలోచనలను నేర్చుకున్నారు. రాయ్‌ తన 22వ ఏట ఆంగ్లం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఫ్రెంచ్‌ విప్లవం, యూరప్‌ రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు.
  • అప్పటి భారత సమాజంలో పేరుకుపోయిన అంధ విశ్వాసాలు ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. పాశ్చాత్య సంస్కృతుల్లో అవి లేవని గ్రహించారు. ఆధునిక విద్య ఆవశ్యతకను గుర్తించి, దేశంలో దాన్ని వ్యాప్తి చేయాలని పూనుకున్నారు.
  • మత, రాజకీయ, సామాజిక సంస్కరణలకు తన జీవితాన్ని అంకితం చేసే ఉద్దేశంతో 1814లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, కోల్‌కతాకు వెళ్లారు. 

సిద్ధాంతం..

  • పాశ్చాత్య ఆధునిక ఆలోచనలకు రామ్మోహన్‌ రాయ్‌ బాగా ప్రభావితమయ్యారు. హేతువాదం, ఆధునిక శాస్త్రీయ దృక్పథాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
  • నాటి సమాజంలోని మత ఛాందసవాదాలు ప్రజల జీవితానికి హానికరంగా మారాయని; వాటివల్ల మానవులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన విశ్వసించారు.
  • సామాజిక సంస్కరణ, రాజకీయ ఆధునికీకరణ రెండూ మత సంస్కరణతోనే సాధ్యమని రాయ్‌ నిర్ధారించారు.
  • మానవులందరికీ సమాజ సమానత్వాన్ని ఆయన కోరుకున్నారు. దీనికి అడ్డుగా ఉన్న కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు.
  • రాయ్‌ ఇస్లామిక్‌ ఏకేశ్వరోపాసన పట్ల ఆకర్షితులయ్యారు. హిందూ వేదాంతంలోని ప్రాథమిక సందేశం కూడా ఇదేనని ఆయన పేర్కొన్నారు. దేవుడు ఒక్కడే అనే భావన మానవాళికి ఒకే సార్వత్రిక నమూనాకు మద్దతు ఇస్తుందని ఆయన విశ్వసించారు. 
రాజా రామ్మోహన్‌ రాయ్‌ సంస్కరణల రూపంలో సమాజానికి చేసిన సేవ, బ్రహ్మ సమాజం, ఆయన సాహిత్య రచనలు తదితర పూర్తి సమాచారంతోపాటు యూపీఎస్సీ సివిల్స్, టీజీపీఎస్సీ, యూజీసీ నెట్‌ తదితర పరీక్షల్లో అడిగిన 80కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌... ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. రాజా రామ్మోహన్‌ రాయ్‌ బెంగాల్‌ ప్రెసిడెన్సీలోని రాధానగర్‌లో ఎప్పుడు జన్మించారు?

(మహారాష్ట్ర తలాఠి, 2023)

1) 1772   2) 1775   3) 1773    4) 1778

సమాధానం: 1

2. రామ్మోహన్‌ రాయ్‌కి ‘రాజా’ అనే బిరుదు ఎవరు ఇచ్చారు?

(యూపీపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ ప్రిలిమ్స్, 2012)

1) లార్డ్‌ విలియం బెంటింక్‌            2) అక్బర్‌ 2

3) బ్రహ్మ సమాజ అనుచరులు        4) ఎవరూ కాదు

సమాధానం: 2

3. Consider the following statements about Raja Ram Mohan Roy:     
(UPSC Prelims 2025)
i. He possessed great love and respect for the traditional philosophical systems of the East.
ii. He desired his countrymen to accept the rational and scientific approach and the principle of human dignity and social equality of all men and women.
Which of the statements given above is/are correct?
1) i only                2) ii only
3) Both i and ii            4) Neither i nor ii
Ans: 3
4. Given below are two statements, one is labelled as Assertion A and the other is labelled as Reason R.
Assertion A: Raja Rammohan Rai rejected Christianity and denied the divinity of Jesus Christ
Reason R: Raja Rammohan Rai wrote the Precepts of Jesus, published in 1820.
In light of the above statements, choose the most appropriate answer from the options given below.
(UGC NET 2022)
1) Both A and R are correct and R is the correct explanation of A
2) Both A and R are correct but R is NOT the correct explanation of A
3) A is correct but R is not correct
4) A is not correct but R is correct
Ans: 1
5. Whose greatest achievement was the setting up of the Brahmo Samaj?
(SSC GD Previous Paper 2019)
1) B.R. Ambedkar            2) Aurobindo Gosh
3) Raja Ram Mohan Roy        4) Vivekanandha
Ans: 3
6. Raja Ram Mohan Roy was an active social reformer who spoke greatly for the problems faced by women. He was an inseparable agent who brought down the social evil of ‘sati’. The reform association founded by him was:
(RRB NTPC (UG) CBT-I 2025)
1) Arya Samaj            2) Prarthana Samaj
3) Brahmo Samaj            4) Ramakrishna Mission
Ans: 3

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram