సీఎస్‌ విజయానంద్‌ పదవీకాలం పొడిగింపు

సీఎస్‌ విజయానంద్‌ పదవీకాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం 2025, నవంబరు 29న ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి సీఎస్‌గా జి.సాయిప్రసాద్‌ను నియమించింది.

2025 డిసెంబరు 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు విజయానంద్‌ సీఎస్‌గా కొనసాగుతారు. సాయిప్రసాద్‌ 2026 మార్చి 1న కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపడతారు. 

సాయిప్రసాద్‌ ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రికి ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ ప్రభుత్వం ఇటీవల ఆయనకు పూర్తి అదనపు బాధ్యత అప్పగించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram