ఆంధ్రప్రదేశ్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ.1,78,076.99 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చింది. ఇందులో పన్నుల రాబడి రూ.1,42,926.19 కోట్లు. బడ్జెట్ అంచనాల్లో మొత్తం రాబడి 81.70%గా ఉండగా..., పన్నుల రాబడి 85.80%గా ఉంది. కిందటి ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చి నెలాఖరు వరకు తేలిన లెక్కలను కాగ్ వెల్లడించింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ.77,317.56 కోట్ల నికర రుణాలు సమీకరించినట్లు పేర్కొంది.