భారత దీర్ఘకాలిక సార్వభౌమ రుణ రేటింగ్ను ‘బీబీబీ’ నుంచి ‘బీబీబీ+’కు పెంచుతున్నట్లు జపాన్ సంస్థ రేటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ (ఆర్ అండ్ ఐ) ప్రకటించింది.
మన దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ అంచనాను ‘స్థిరం’గా కొనసాగించింది. 2025లో భారత్ రేటింగ్ను పెంచిన మూడో సార్వభౌమ రుణ రేటింగ్ సంస్థగా ఆర్ అండ్ ఐ నిలిచింది.
2025 మేలో మన రేటింగ్ను బీబీబీ (తక్కువ) నుంచి ‘బీబీబీ’గా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మార్నింగ్స్టార్ డీబీఆర్ మార్చింది.
అమెరికాకు చెందిన ఎస్ అండ్ పీ, గత ఆగస్టులో భారత రేటింగ్ను బీబీబీ- నుంచి బీబీబీ చేసింది.