భారత్‌లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు

భారత్‌లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు

ముందు తరాల నుంచి పొంది.. ప్రస్తుతం అనుభవిస్తూ.. తర్వాతి తరాలకు అందించేదే వారసత్వం. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. భూమి అనేక ప్రకృతి అందాలకు నెలవు. వివిధ రకాల కొండలు - కోనలు, వాగులు - వంకలు, చెట్లు - చేమలు, జంతువులు - పక్షులు, పురాతన స్థలాలు, చారిత్రక కట్టడాలు, అపురూప కళాఖండాలు మొదలైనవన్నీ వారసత్వ చిహ్నాలు. వీటన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ. వారసత్వం అంటే కేవలం చరిత్ర కాదు. గత వైభవాన్ని జ్ఞప్తికి తెస్తూ, భవిష్యత్తుకు బాటలు వేసే స్మృతి పథం. అయితే ప్రస్తుత మానవ చర్యల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అరుదైన ప్రదేశాలు నాశనమవుతున్నాయి. దీన్ని అరికట్టి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను సంరక్షించాలనే లక్ష్యంతో యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) భూమిపై ఉన్న వారసత్వ ప్రదేశాలకు గుర్తింపు ఇస్తూ, వాటి పరిరక్షణకు చర్యలు చేపడుతోంది.

ఎంపిక ఇలా..

  • 1972, నవంబరు 19న పారిస్‌లో యునెస్కో జనరల్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన ప్రదేశాలను రక్షించడమే లక్ష్యంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. దీన్నే 1972 ప్రపంచ వారసత్వ సదస్సు (World Heritage Convention 1972) అంటారు. భవిష్యత్తు తరాల కోసం అత్యుత్తమ సార్వత్రిక విలువలు కలిగిన సాంస్కృతిక, సహజ వారసత్వాన్ని సంరక్షించడం ఈ సదస్సు లక్ష్యం.
  • 1975 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. భారత్‌ 1977లో ఈ కన్వెన్షన్‌ను ఆమోదించింది. ప్రస్తుతం 196 దేశాలు దీన్ని అనుసరిస్తున్నాయి.
  • సభ్యదేశాలు తమ ప్రాంతంలో పూర్వం నుంచి ఉన్న సహజ, సాంస్కృతిక ప్రదేశాలను ‘వారసత్వ ప్రదేశాలు’గా గుర్తించమని కోరుతూ యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి నివేదిస్తాయి. వీటి ఎంపికలో ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మాన్యుమెంట్స్‌ అండ్‌ సైట్స్‌ (ఐసీఓఎంఓఎస్‌), ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) బాధ్యత వహిస్తాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక కమిటీ వారసత్వ హోదాను ప్రకటిస్తుంది.
  • ప్రపంచ వారసత్వ సదస్సు అమలును పర్యవేక్షించే బాధ్యత ఈ వారసత్వ కమిటీకి ఉంటుంది. వేటిని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలో నిర్ణయించడానికి, ఇప్పటికే లిస్ట్‌లో ఉన్న వాటిపై నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కమిటీ సంవత్సరానికోసారి సమావేశం అవుతుంది. ఇందులో 21 సభ్య దేశాలు ఉంటాయి. ప్రతి రెండేళ్లకోసారి కొత్త వాటిని ఎన్నుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా

  • 2025, జులై నాటికి 170 దేశాల్లో మొత్తం 1248 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో 972 సాంస్కృతిక ప్రదేశాలు, 235 సహజ ప్రాంతాలు, 41 మిశ్రమ ప్రదేశాలు ఉన్నాయి.
  • ఇటలీ 61 ప్రదేశాలతో జాబితాలో మొదటి స్థానంలో ఉండగా.. చైనా (60), జర్మనీ (55), ఫ్రాన్స్‌ (54) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • 2025, జులై 6 నుంచి 16 వరకు ఫ్రాన్స్‌లోని పారిస్‌లో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశం జరిగింది. ఇందులో మొత్తం 26 ప్రదేశాలను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. భారత్‌లో మరాఠా పాలకులు నిర్మించిన 12 కోటలకు ‘మరాఠా మిలటరీ లాండ్‌స్కేప్స్‌’ పేరుతో చోటు దక్కించుకున్నాయి .

భారతదేశంలో

  • భారత్‌ అపారమైన సాంస్కృతిక, సహజ వైవిధ్యం కలిగిన దేశం. పురాతన దేవాలయాలు మొదలు స్మారక చిహ్నాలు, రాజుల కాలం నాటి కట్టడాలు, సహజ ప్రకృతి దృశ్యాలకు ఇది నిలయంగా ఉంది.
  • భారతదేశంలో యునెస్కో 44 వారసత్వ ప్రదేశాలను గుర్తించింది. వీటిలో 36 సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినవి కాగా, ఏడు సహజ సౌందర్యానికి గుర్తింపు పొందాయి, ఒకటి (కాంచనజంగా నేషనల్‌ పార్క్‌) మిశ్రమ విభాగంలో గుర్తింపు పొందింది.
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం ఒక్కటే ఆ జాబితాలో చోటు దక్కించుకుంది.

దేశంలోని 44 వారసత్వ ప్రాంతాలు 

వారసత్వ ప్రదేశం రాష్ట్రం సంవత్సరం రకం
అజంతా గుహలు మహారాష్ట్ర 1983 సాంస్కృతిక
ఎల్లోరా గుహలు మహారాష్ట్ర 1983 సాంస్కృతిక
ఆగ్రా కోట ఉత్తర్‌ ప్రదేశ్‌ 1983 సాంస్కృతిక
తాజ్‌ మహల్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌ 1983 సాంస్కృతిక
సూర్య దేవాలయం ఒడిశా 1984 సాంస్కృతిక
మహాబలిపురంలోని స్మారక చిహ్నాల సమూహం తమిళనాడు 1984 సాంస్కృతిక
కాజిరంగ జాతీయ ఉద్యానవనం అస్సాం 1985 సహజ
మానస్‌ వన్యప్రాణుల అభయారణ్యం అస్సాం 1985 సహజ
కియోలాడియో జాతీయ ఉద్యానవనం రాజస్థాన్‌ 1985 సహజ
చర్చిలు, కాన్వెంట్స్‌ ఆఫ్‌ గోవా గోవా 1986 సాంస్కృతిక
ఖజురహో స్మారక చిహ్నాల సమూహం మధ్యప్రదేశ్‌ 1986 సాంస్కృతిక
హంపి వద్ద స్మారక చిహ్నాల సమూహం కర్ణాటక 1986 సాంస్కృతిక
ఫతేపూర్‌ సిక్రీ ఉత్తర ప్రదేశ్‌ 1986 సాంస్కృతిక
పట్టడకల్‌ వద్ద స్మారక చిహ్నాల సమూహం కర్ణాటక 1987 సాంస్కృతిక
ఏనుగు గుహలు మహారాష్ట్ర 1987 సాంస్కృతిక
గ్రేట్‌ లివింగ్‌ చోళ దేవాలయాలు తమిళనాడు 1987 సాంస్కృతిక
సుందర్బన్స్‌ నేషనల్‌ పార్క్‌ పశ్చిమ బెంగాల్‌ 1987 సహజ
నందా దేవి, వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ నేషనల్‌ పార్క్స్‌ ఉత్తరాఖండ్‌ 1988 సహజ
సాంచిలోని బౌద్ధ స్మారక చిహ్నాలు మధ్యప్రదేశ్‌ 1989 సాంస్కృతిక
హుమాయూన్‌ సమాధి దిల్లీ 1993 సాంస్కృతిక
కుతుబ్‌ మినార్, దాని స్మారక చిహ్నాలు దిల్లీ 1993 సాంస్కృతిక
భారతదేశ పర్వత రైల్వేలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌ 1999 సాంస్కృతిక
బోధ్‌ గయలోని మహాబోధి ఆలయ సముదాయం బిహార్‌ 2002 సాంస్కృతిక
భీంబెట్కా రాతి ఆశ్రయాలు మధ్యప్రదేశ్‌ 2003 సాంస్కృతిక
ఛత్రపతి శివాజీ టెర్మినస్‌  (గతంలో విక్టోరియా టెర్మినస్‌) మహారాష్ట్ర 2004 సాంస్కృతిక
చంపనేర్‌ - పావగఢ్‌ పురావస్తుఉద్యానవనం గుజరాత్‌ 2004 సాంస్కృతిక
ఎర్రకోట సముదాయం దిల్లీ 2007 సాంస్కృతిక
జంతర్‌ మంతర్‌ రాజస్థాన్‌ 2010 సాంస్కృతిక
పశ్చిమ కనుమలు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు 2012 సహజ
రాజస్థాన్‌ కొండ కోటలు రాజస్థాన్‌ 2013 సాంస్కృతిక
రాణి-కి-వావ్‌ గుజరాత్‌ 2014 సాంస్కృతిక
గ్రేట్‌ హిమాలయన్‌ నేషనల్‌ పార్క్‌             కన్జర్వేషన్‌ ఏరియా హిమాచల్‌ ప్రదేశ్‌ 2014 సహజ
నలంద మహావిహార బిహార్‌ 2016 సాంస్కృతిక
కాంచనజంగా నేషనల్‌ పార్క్‌ సిక్కిం 2016 మిశ్రమ

ది ఆర్కిటెక్చర్‌ వర్క్‌ ఆఫ్‌ లీ కబుసైర్‌

చండీగఢ్‌ 2016 సాంస్కృతిక
అహ్మదాబాద్‌ గుజరాత్‌ 2017 సాంస్కృతిక
విక్టోరియన్‌ గోతిక్, ఆర్ట్‌ డెకో ఎన్‌సెంబుల్స్‌ ఆఫ్‌ ముంబై మహారాష్ట్ర 2018 సాంస్కృతిక
జైపుర్‌ రాజస్థాన్‌ 2019 సాంస్కృతిక
కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం తెలంగాణ 2021 సాంస్కృతిక

ధోలవీర: హరప్పా నగరం

గుజరాత్‌ 2021 సాంస్కృతిక
శాంతినికేతన్‌ పశ్చిమ బెంగాల్‌ 2023 సాంస్కృతిక
శాక్రడ్‌ ఎన్‌సెంబుల్స్‌ ఆఫ్‌ ది హొయసల కర్ణాటక 2023 సాంస్కృతిక
అహోం రాజవంశీకుల సమాధులు అస్సాం 2024 సాంస్కృతిక
మరాఠా మిలటరీ లాండ్‌ స్కేప్స్‌ మహారాష్ట్ర 2025 సాంస్కృతిక


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు 

(UPSC CSE Prelims 2024)
Q:
Consider the following properties included in the World Heritage List released by UNESCO:
1. Shantiniketan
2. Rani-ki-Vav
3. Sacred Ensembles of the Hoysalas
4. Mahabodhi Temple Complex at Bodhgaya
How many of the above properties were included in 2023?
1) Only one        
2) Only two
3) Only three      
4) All four
Answer: 2

(MPSC 2019 Prelims Paper 1)
Q:
Consider the following statements:
a. As of July 2018, a total of 1092 World Heritage sites exist across 167 countries.
b. Italy, with 54 World Heritage sites has the most of any country (up to July 2018).
c. India has 39 World Heritage sites (up to July 2018).
d. A collection of Victorian, Gothic, and Art Deco buildings of Mumbai are declared as World Heritage sites in 2018.
Which of the above statements are correct? 
1) a, b and d        
2) b, c and d
3) a, b and c        
4) All of the above
Answer: 1

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram