మహిళల స్థితిగతుల మెరుగుదల కోసం ఏర్పాటైన సంస్థలు

మహిళల స్థితిగతుల మెరుగుదల కోసం ఏర్పాటైన సంస్థలు

భారత సమాజంలోని మహిళల స్థితిగతుల మెరుగుదల కోసం 19వ శతాబ్దం ప్రారంభంలో పోరాటాలు మొదలయ్యాయి. పలువురు సంఘసంస్కర్తలు ప్రాంతీయ, జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు నెలకొల్పి తమ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారిని భాగస్వాములను చేశారు. మొదట్లో మహిళలపై జరుగుతోన్న సామాజిక దురాచారాలను అంతం చేయడానికి సాగిన ఉద్యమం తర్వాతి కాలంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వరాజ్య సాధన కోసం మళ్లింది. అదే సమయంలో మహిళలు రాజకీయ హక్కులు, వ్యక్తిగత చట్టాల సంస్కరణల కోసం డిమాండ్‌ చేశారు. స్వాతంత్య్రానంతరం కఠినమైన సామాజిక నిబంధనలు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా నినదించి.. మహిళలపై హింస, లింగ అసమానతలపై పోరాడారు. ఆయా సంస్థలు ఉద్యమ వ్యాప్తి, మద్దతు, హక్కుల సాధనలో ముఖ్య భూమిక పోషించాయి. ప్రజలను చైతన్యపరిచి ఆయా ఉద్యమాల్లో పాల్గొనేలా చేయడంలోనూ కీలకంగా వ్యవహరించాయి. పోటీ పరీక్షల కోణంలో మహిళల స్థితిగతుల మెరుగుదల కోసం ఏర్పాటైన ప్రముఖ సంస్థల గురించి తెలుసుకుందాం..!

మహిళా అభ్యున్నతికి పాటుపడిన ప్రముఖ సంఘసంస్కర్తలు

  • రాజా రామ్‌మోహన్‌రాయ్‌: 1772లో బెంగాల్‌లోని రాధానగర్‌లో జన్మించారు. సతీసహగమనాల రద్దు, వితంతు పునర్వివాహాలు, మహిళా విద్యను ప్రోత్సహించడం లాంటివి చేశారు. ఈయన 1828 ఆగస్టు 20న బ్రహ్మసమాజాన్ని స్థాపించారు.  
  • ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌: 1820, సెప్టెంబరు 26న బెంగాల్‌లోని బిర్సింఘాలో జన్మించారు. జీవితాన్ని మహిళా చైతన్యం కోసం అంకితం చేసిన సంస్కర్త ఈయన. వితంతు వివాహాలకు అనుకూలంగా పోరాడారు. బాల్య వివాహాలు, బహుభార్యత్వానికి వ్యతిరేకంగానూ ఉద్యమించారు.  

జ్యోతి రావు ఫులే (1827-90) - సావిత్రీబాయి ఫూలే (1831-97):

  • అణగారిన ప్రజలు, స్త్రీ జనోద్ధరణ, కుల నిర్మూలనకు పాటుపడ్డారు. సామాజిక అసమానతలు, మూఢ విశ్వాసాలను అరికట్టేందుకు 1873, సెప్టెంబరు 24న ‘సత్యశోధక సమాజాన్ని’ ప్రారంభించారు.

స్త్రీలు ఏర్పాటు చేసిన కొన్ని మహిళా సంస్థలు

  • ది లేడీస్‌ సొసైటీ: దీన్ని 1882లో స్వర్ణకుమారి దేవి కోల్‌కతాలో నెలకొల్పారు. ఈమె రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సోదరి. వితంతువులకు విద్య, జీవనోపాధి నైపుణ్యాలు అందించడం దీని ముఖ్య ఉద్దేశం.
  • ఆర్య మహిళా సమాజం: దీన్ని ప్రముఖ సామాజిక సంస్కర్త పండిత రమాబాయి 1882, నవంబరు 30న పుణెలో నెలకొల్పారు. మహిళా విద్యను ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడం, స్త్రీల సామాజిక స్థితిని మెరుగుపరచడంపై ఈ సమాజం ప్రముఖంగా దృష్టి సారించింది.
  • భారత్‌ మహిళా పరిషత్‌: దీన్ని ఇండియా ఉమెన్‌ కాన్ఫరెన్స్‌ లేదా లేడీస్‌ సోషల్‌ కాన్ఫరెన్స్‌ అని కూడా అంటారు. 1904లో బొంబాయిలో రమాబాయి రనడే స్థాపించారు. ఇది ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో భాగమైన నేషనల్‌ సోషల్‌ కాన్ఫరెన్స్‌కు మహిళా విభాగంగా పనిచేసింది.

మహిళా సంస్థల ప్రభావం

  • 1919 నాటి మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం అన్ని రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల్లో మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది.
  • 1920లో ట్రావెన్‌కోర్‌ - కొచ్చిన్‌ సంస్థానం స్త్రీలకు ఓటు హక్కు కల్పించింది.
  • 1921లో మద్రాస్, బాంబే ప్రావిన్స్‌లు పురుషుల మాదిరే స్త్రీలకు ఓటుహక్కు కల్పించాయి.
  • 1925లో పంజాబ్‌లో స్త్రీలకు విద్యార్హత, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ఓటు హక్కు ఇచ్చారు.
  • 1926లో మహిళలకు ప్రాంతీయ శాసనసభల్లో సభ్యత్వ హక్కు ఇచ్చారు. ఇది ప్రభుత్వం నామినేట్‌ చేసిన సభ్యులకు మాత్రమే ఉంటుంది.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఆర్య మహిళా సమాజాన్ని ఎవరు స్థాపించారు?

(ఎస్‌ఎస్‌సీ గ్రాడ్యుయేట్‌ లెవల్, 2022), (యూపీఎస్సీ ఈపీఎఫ్‌ఓ, 2016)

1) సరళా దేవి చౌధురాని   2) డీకే కార్వే

3) సరోజినీ నాయుడు      4) పండిత రమాబాయి

సమాధానం: 4

2. రాజా రామ్‌మోహన్‌ రాయ్‌ బెంగాల్‌ ప్రెసిడెన్సీలోని రాధానగర్‌లో కింది ఏ సంవత్సరంలో జన్మించారు?

(మహారాష్ట్ర తిలతి, 2023)

1) 1772   2) 1775   3) 1773   4) 1778

సమాధానం: 1

3. భారతదేశ మొదటి మహిళా సంస్థ అయిన ‘భారత స్త్రీ మహామండల్‌’ను ఎవరు స్థాపించారు?

(యూపీఎస్సీ ఈపీఎఫ్‌ఓ 2026), (దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌), 2023),(ఎంపీపీజీసీఎల్‌ జేఈ సివిల్, 2024)

1) అనిబిసెంట్‌            2) మెహర్‌బాయి టాటా

3) సరళా దేవి చౌధురాని     4) తారాబాయి షిండే

సమాధానం: 3

4. ది ఉమెన్స్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ కింది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?

(ఎస్‌ఎస్‌సీ మెట్రిక్‌ లెవల్, 2022), (ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2024)

1) 1927   2) 1917   3) 1907    4) 1937

సమాధానం: 2

5. Raja Ram Mohan Roy founded a reform association known as Brahmo Sabha which was later known as ______.
(SSC CGL Tier-I 2022)
1) Dev Samaj   2)  Arya Samaj    3) Brahmo School   4) Brahmo Samaj
Ans: 4
6. Consider the following statements about Raja Ram Mohan Roy's political thought-
(i) He synthesised concepts of natural rights along with social utility and welfare of human being.
(ii) He had impact of Locke and Hume, because he gave importance to psychological elements instead of Historical elements in his analysis.
Select the correct option among the following-
(RPSC Assistant Professor, 2024)
1) Only statement (i) is true.       
2) Only statement (ii) is true.
3) Both Statements (i) and (ii) are false.
4) Both Statements (i) and (ii) are true
Ans: 4

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram