2025, జులైలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,95,735 కోట్ల మేర నమోదయ్యాయి. 2024, జులైతో పోలిస్తే వసూళ్లలో 7.5% వృద్ధి కనిపించింది. కేంద్ర ఆర్థికశాఖ 2025, ఆగస్టు 1న విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. దేశీయ వ్యాపారాలు, సేవల ద్వారా రూ.1,43,023 కోట్లు, దిగుమతుల ద్వారా రూ.52,712 కోట్లు వసూలయ్యాయి. నెలవారీ వసూళ్లు రూ.1.80 లక్షల కోట్లు దాటడం ఇది వరుసగా ఏడోసారి.