స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
  • భారత్, ఒమన్‌ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2026, జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై ఆ దేశానికి వెళ్లే మన ఎగుమతుల్లో 99 శాతానికి సుంకమే ఉండదు. ఒమన్‌ నుంచి మనకు వచ్చే ఖర్జూరాలపై కోటా ఆధారిత సుంకాల మినహాయింపులుండడం వల్ల, అవి చౌకగా లభించొచ్చు. అంతేకాకుండా మన ఎగుమతిదార్లకు ఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) ఎంతో కీలకం కానుంది.
  • అమెరికా-ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో, హర్మూజ్‌ జలసంధిలో ఆటంకాల వల్ల గల్ఫ్‌ (ఒమన్, బహ్రెయిన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ) దేశాలకు మన వస్తువులను ఎగుమతి చేయడం కష్ట్జమవుతోంది. ఒమన్‌ తీరప్రాంతం హర్మూజ్‌ జలసంధి వెలుపల ఉండటంతో, వాణిజ్యం, ఇంధన రవాణాకు ఎంతో ఉపయోగ పడుతుందని మేధో సంస్థ జీటీఆర్‌ఐ తెలిపింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram