జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) లీక్కు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2026, జులై 25న తన పదవికి రాజీనామా చేశారు.
ఆయన స్థానంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేంద్రం అప్పగించింది. ప్రధాని మోదీ సలహా మేరకు ధర్మేంద్ర రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. జోషికి బాధ్యతలపై ఉత్తర్వులు వెలువరించారు.