పంజాబ్లో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను రద్దు చేస్తూ పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం 2026, మే 30న చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 51 ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న 65,048 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు ప్రకటించింది. పంజాబ్ ఔట్సోర్స్డ్ పర్సనల్ (ట్రాన్షిషన్ టూ కాంట్రాక్చువల్ ఎంగేజ్మెంట్) బిల్లు-2026 ప్రకారం అయిదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న ఔట్సోర్స్డ్ గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగులు ప్రభుత్వ కాంట్రాక్చువల్ ఉద్యోగులుగా మారతారు. రోజువారీ విధుల్లో ప్రమాదం ఎదుర్కొనే అగ్నిమాపక సిబ్బంది, పీఎస్పీసీఎల్ లైన్మెన్, పట్టణ స్థానిక సంస్థల పారిశుద్ధ్య కార్మికులు, వ్యర్థాల నిర్వహణ కార్మికులు, క్షేత్రస్థాయి ఫిర్యాదుల సిబ్బంది అయిదేళ్ల తర్వాత కాకుండా మూడేళ్ల తర్వాత తదుపరి స్థాయికి అర్హత పొందుతారని ప్రభుత్వం తెలిపింది. అయిదేళ్లు ఔట్సోర్స్ చేసిన వారికి నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని తెలిపింది.