శాస్త్రవేత్తలు సెసీము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాగిలకు 2025 ఏడాదికి రసాయన శాస్త్రంలో నోబెల్ వరించింది. ఈ విషయాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అక్టోబరు 8న ప్రకటించింది. ఎడారుల్లో పొడి గాలి నుంచి తేమ/నీటిని ఉత్పత్తి చేయడం, వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను సంగ్రహించడం లాంటి కీలక ప్రక్రియలకు అవసరమైన మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లను అభివృద్ధి చేసినందుకు వీరికి ఈ పురస్కారం దక్కింది.
రాబ్సన్ (88) ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి, కిటగావా (74) జపాన్లోని క్యోటో యూనివర్సిటీకి, యాగి (60) అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి (బెర్కెలీ) అనుబంధంగా పనిచేస్తున్నారు.