హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే రక్షణ రంగ తయారీ సంస్థ జెన్ టెక్నాలజీస్ సరికొత్త హై-ఆల్టిట్యూడ్ మ్యాన్- పోర్టబుల్ యాంటీ- డ్రోన్ వ్యవస్థను 2026, జులై 26న ఆవిష్కరించింది. ఎత్తయిన పర్వతాలు, సరిహద్దు ప్రాంతాల్లో విధుల్లో ఉండే సైనిక బలగాలను శత్రుదేశాల డ్రోన్ల ముప్పు నుంచి రక్షించడానికి ఈ తేలికపాటి వ్యవస్థ ఉపయోగపడుతుంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దీన్ని రూపొందించారు.
కార్గిల్ యుద్ధంలో భారత సాయుధ బలగాలు చూపించిన ధైర్యసాహసాలు, త్యాగాలకు నివాళిగా. పర్వత ప్రాంతాల్లో సైనికులకు డ్రోన్ల ద్వారా ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టేలా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు.