శత్రువుల కదలికలను గగనతలం నుంచే పసిగట్టే అత్యాధునిక ‘ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్’ మార్క్-2 వ్యవస్థల సంయుక్త అభివృద్ధి కోసం అదానీ డిఫెన్స్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇందులో భాగంగా 6 ఎయిర్బస్ ఏ321 విమానాలను అత్యాధునిక మిషన్ వ్యవస్థలతో తీర్చిదిద్దుతారు. వీటికి దాదాపు 30 ఏళ్లపాటు సమగ్ర లాజిస్టిక్స్, మరమ్మతులు, సాంకేతిక తోడ్పాటును ఈ భాగస్వామ్య సంస్థలే అందిస్తాయి. వీటిని 2032-33 నాటికి వాయుసేనలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.