ప్రైవేటు రక్షణసంస్థ అయిన నిబే లిమిటెడ్.. వాయుఅస్త్ర లాయిటరింగ్ మ్యూనిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్లో, ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ వద్ద ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు ఆ కంపెనీ తెలిపింది. లాయిటరింగ్ మ్యూనిషన్లు ఆత్మాహుతి డ్రోన్లు. ఇవి ఆకాశంలో తిరుగుతూ ఏదైనా లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే దానిపై విరుచుకుపడతాయి. పోఖ్రాన్లో జరిగిన తొలి ప్రయోగంలో ‘వాయుఅస్త్ర-1’ దాదాపు 10 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లిందని నిబే లిమిటెడ్ పేర్కొంది.