అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘సర్దుబాటు చేసిన ప్రతీకార సుంకం’ భారత్పై 25 శాతంగా ఉంటుందని ప్రకటించారు. ఇవి ఆగస్టు 7 నుంచే అమలవుతాయని వెల్లడించారు. భారత్తోసహా ఇతర దేశాలపై 10% నుంచి 41% వరకు సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ‘ప్రతీకార సుంకాల్లో మరిన్ని మార్పులు’ పేరుతో దీన్ని వెలువరించారు.
♦ సిరియాపై అత్యధికంగా 41శాతం టారిఫ్ను విధించారు. దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను పెంచారు.