ఐరాస మానవ హక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్సీ) సభ్య దేశంగా భారత్ వరుసగా ఏడోసారి ఎన్నికయింది. ఎన్నికల ఫలితాలను యూఎన్హెచ్ఆర్సీ 2025, అక్టోబరు 15న విడుదల చేసింది. ఈ విజయంతో 2026 జనవరి 1 నుంచి మూడేళ్ల పాటు భారత్ సభ్య దేశంగా కొనసాగనుంది. 47 సభ్య దేశాలు ఉండే యూఎన్హెచ్ఆర్సీలో భారత్తో పాటు ఎన్నికయిన దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉంది.