పాకిస్థాన్, సౌదీ అరేబియాల మధ్య 2025, సెప్టెంబరు 17న రక్షణ ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం.. ఈ రెండింటిలో ఏ ఒక్క దేశంపై ఎవరు దాడిచేసినా రెండు దేశాలపై దాడి చేసినట్లుగానే భావించి ఉమ్మడిగా ఎదుర్కొంటాయి.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది.