ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నం (ఏయూడీఓఏ) 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ, పీజీ డిప్లొమా (సెల్ఫ్ సపోర్టేడ్) కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీ అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ - (40)
2. పీజీ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ - (15)
3. పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ - (15)
4. పీజీ డిప్లొమా ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ - (15)
కోర్సు వ్యవధి: మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ రెండేళ్లు, పీజీ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ 1 సంవత్సరం.
అర్హత: కోర్సులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్, బీ.ఫార్మసీ, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 35 ఏళ్లు.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 7.
చిరునామా: ది డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఆంధ్రా యూనివర్సిటీ, విజయనగర్ ప్లేస్, పెదవాల్తేర్, విశాఖపట్నం-530003. చిరునామాకు దరఖాస్తులు పంపించాలి.
* కౌన్సెలింగ్ తేదీ: 2025 నవంబర్ 11.
కౌన్సెలింగ్ ఫీజు: రూ.200.
మరిన్ని వివరాలకు సంప్రదించండి: 7995013421, 7207953919.