ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కర్నూలు, నంద్యాల, అనంతపురము, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 277
వివరాలు:
1. కర్నూలు: 46
2. నంద్యాల: 43
3. అనంతపురం: 50
4. శ్రీ సత్యసాయి: 34
5. కడప: 60
6. అన్నమయ్య: 44
విభాగాలు: డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్.
అర్హత: పదోతరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.118.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 అక్టోబర్ 25.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 8.