రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య: 5,810.
వివరాలు:
గ్రాడ్యుయేట్ పోస్టులు:
1. కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్: 161పోస్టులు
2. స్టేషన్ మాస్టర్: 615 పోస్టులు
3. గూడ్స్ రైలు మేనేజర్: 3,416 పోస్టులు
4. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 921 పోస్టులు
5. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 638 పోస్టులు
6. ట్రాఫిక్ అసిస్టెంట్: 59
ఆర్ఆర్బీ రీజియన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్-79; అజ్మేర్-345, బెంగళూరు-241, భువనేశ్వర్-231, బిలాస్పూర్-864, చండీగఢ్-199, చెన్నై-187, గువాహటి-56, గోరఖ్పుర్-111, జమ్ము & శ్రీనగర్-32, కోల్కతా-685, మాల్దా-522, ముంబయి-596, ముజఫర్పూర్-21, పట్నా-23, ప్రయాగ్రాజ్-110, రాంచీ-651, సికింద్రాబాద్-396, సిలిగురి-21, తిరువనంతపురం-58.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత.
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్/ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు అదనంగా కంప్యూటర్లో ఇంగ్లిష్/ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.
వయోపరిమితి: 01-01-2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ప్రారంభ వేతనం: నెలకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్/ స్టేషన్ మాస్టర్ పోస్టులకు రూ.35,400; ట్రాఫిక్ అసిస్టెంట్కు రూ.25,500; ఇతర పోస్టులకు రూ.29,200.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్-1, టైర్-2), టైపింగ్ స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) సబ్జెక్టులు: జనరల్ అవేర్నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), మ్యాథ్స్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు). మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు.
పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు.
రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) సబ్జెక్టులు: జనరల్ అవేర్నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), మ్యాథ్స్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (35 ప్రశ్నలు- 35 మార్కులు). మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు కేటాయించారు.
పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు.
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-2025.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 22.11.2025.
దరఖాస్తు సవరణ తేదీలు: 23.11.2025 నుంచి 02.12.2025 వరకు.