భారతీయ రైల్వే దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 2,570
వివరాలు:
ఆర్ఆర్బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పూర్, జమ్ము & శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.
వయోపరిమితి: 01.01.2026 నాటికి 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు: రూ.35,400.
ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 31.10.2025.
ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 30.11.2025.
Website:https://rrbsecunderabad.gov.in/