ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

చంద్రశేఖర్‌

20వ శతాబ్దపు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తల్లో చంద్రశేఖర్‌ ఒకరు. ఈయన సంఖ్యా సిద్ధాంతం, సమ్మబిలిటీ రంగాల అభివృద్ధిలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు.


20వ శతాబ్దపు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తల్లో చంద్రశేఖర్‌ ఒకరు. ఈయన సంఖ్యా సిద్ధాంతం, సమ్మబిలిటీ రంగాల అభివృద్ధిలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. మ్యాథ్స్‌కి సంబంధించి ఆయన అనేక పుస్తకాలు రచించారు. గణిత సూత్రాలను ప్రజలకు దగ్గర చేయడంలో, సులభంగా అభ్యసనం చేయడంలో ఇవి ఎంతగానో తోడ్పడ్డాయి. నవంబరు 21న చంద్రశేఖర్‌ జన్మదినం సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • ఈయన పూర్తి పేరు కొమరవోలు చంద్రశేఖర్‌. 1920, నవంబరు 20న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించారు. తండ్రి బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉండేవారు. ఆయన స్కూలింగ్‌ మొత్తం అక్కడే జరిగింది.
  • ఉన్నత విద్య కోసం నాటి మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజ్‌లో చేరారు. 1940లో గణితంలో బీఏ ఆనర్స్‌ డిగ్రీ పొందారు. 
  • 1940-43 మధ్య కాలంలో మద్రాస్‌ విశ్వవిద్యాలంలోని గణితశాస్త్ర విభాగంలో రిసెర్చ్‌ స్కాలర్‌గా చేరారు. 
  • 1943-46 సమయంలో ప్రెసిడెన్సీ కాలేజ్‌లో పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేశారు. 
  • 1949లో చంద్రశేఖర్‌ను టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) వ్యవస్థాపకులు హోమీ జహంగీర్‌ బాబా టీఐఎఫ్‌ఆర్‌ స్కూల్‌ ఆఫ్‌ మ్యాథమెటిక్స్‌లో అధ్యాపకుడిగా చేరాల్సిందిగా ఆహ్వానించారు. అదే ఏడాది ఆయన టీఐఎఫ్‌ఆర్‌లో చేరారు.

ప్రముఖ రచనలు

  • 1952లో మీనాక్షి సుందరంతో కలిసి ‘టిపికల్‌ మీన్స్‌’ బుక్‌ రాశారు.
  • 1988లో ‘క్లాసికల్‌ ఫోరియరల్‌ ట్రాన్స్‌ఫార్మ్స్‌’ పుస్తకం రాశారు. 
  • ‘ఇంట్రడక్షన్‌ టు ఎనలిటిక్‌ నంబర్‌ థియరీ’ని రచించారు.

పురస్కారాలు - గౌరవాలు

  • అంతర్జాతీయ గణిత సంఘం (ఐఎంయూ)కు 1955-61 మధ్య కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా, 1961-66లో కార్యదర్శిగా, 1971-74 మధ్య అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా గణిత అభివృద్ధికి ఆయన ఎంతగానో పాటుపాడ్డారు. భారత్‌లోని అనేక విద్యాలయాలకు ఐఎంయూ ద్వారా స్పాన్సర్‌షిప్‌ చేయించడంలో ఈయన చొరవ చూపారు. 
  • 1963-66లో ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1966-70లో దానికి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు.
  • 1963లో శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు పొందారు.
  • 1966లో రామానుజన్‌ పతకం అందుకున్నారు.

చివరగా

  • టీఐఎఫ్‌ఆర్‌లో పనిచేసిన కాలంలో చంద్రశేఖర్‌ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా నేటికీ అది ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత సంస్థగా ఉంది. విదేశీ విశ్వవిద్యాలయాలు, సంస్థల తరహాలో భారత విద్యా సంస్థలు ఎదగాలని ఆయన భావించేవారు. విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్యాలను అందించాలని, వాటికోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.  

 


Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram